దుబాయ్ లో కొత్తగా 700కి పైగా మోడ్రన్ బస్ షెల్టర్లు
- December 25, 2023
దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ఎమిరేట్ అంతటా కీలక ప్రదేశాలలో 762 పబ్లిక్ బస్ షెల్టర్లను నిర్మించనుంది. అధికారిక ప్రాజెక్ట్ ప్లాన్ ప్రకారం, అన్ని బస్ షెల్టర్లను 2025 నాటికి పూర్తి చేయనున్నారు. RTA సంస్థ సహకారంతో ట్రయల్ బేస్లో కొన్ని షెల్టర్ల నిర్మాణంలో 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్, డైరెక్టర్ జనరల్, మత్తర్ అల్ తాయర్ మాట్లాడుతూ.. ప్రజా రవాణా సేవలను మెరుగుపరచడానికి మరియు వినియోగదారుల సంతృప్తిని మెరుగుపరచడానికి అధికార యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ బస్ షెల్టర్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ ప్రారంభించిన "మై కమ్యూనిటీ... ఎ ప్లేస్ ఫర్ ఎవ్రీవన్" ఇనిషియేటివ్కు మద్దతు ఇస్తుందన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







