దుబాయ్ లో కొత్తగా 700కి పైగా మోడ్రన్ బస్ షెల్టర్లు
- December 25, 2023
దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ఎమిరేట్ అంతటా కీలక ప్రదేశాలలో 762 పబ్లిక్ బస్ షెల్టర్లను నిర్మించనుంది. అధికారిక ప్రాజెక్ట్ ప్లాన్ ప్రకారం, అన్ని బస్ షెల్టర్లను 2025 నాటికి పూర్తి చేయనున్నారు. RTA సంస్థ సహకారంతో ట్రయల్ బేస్లో కొన్ని షెల్టర్ల నిర్మాణంలో 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్, డైరెక్టర్ జనరల్, మత్తర్ అల్ తాయర్ మాట్లాడుతూ.. ప్రజా రవాణా సేవలను మెరుగుపరచడానికి మరియు వినియోగదారుల సంతృప్తిని మెరుగుపరచడానికి అధికార యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ బస్ షెల్టర్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ ప్రారంభించిన "మై కమ్యూనిటీ... ఎ ప్లేస్ ఫర్ ఎవ్రీవన్" ఇనిషియేటివ్కు మద్దతు ఇస్తుందన్నారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









