ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్రెడ్డి భేటీ..
- December 26, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో ప్రధాని మోదీతో దాదాపు గంటపాటు ఏయే విషయాలపై చర్చించామన్న వివరాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు. విభజన చట్టం ప్రకారం సాధించాల్సిన ప్రయోజనాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాల్సిందిగా మోదీని కోరామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను అడిగామనన్నారు.
సమాఖ్య స్ఫూర్తిలో భాగంగా మోదీని కలిశామని భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెచ్చుకున్నామని అన్నారు. ఈ మూడు విషయాలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం తాత్సారం చేసిందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి గత సర్కారు నిధులు తీసుకురాలేకపోయిందని భట్టి విక్రమార్క అన్నారు. తాము విభజన హామీలను మోదీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరామని అన్నారు.
అలాగే, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గురించి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి విజ్ఞప్తులు చేశామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరామని అన్నారు. తెలంగాణకు ఒక ఐఐఎం, సైనిక్ స్కూల్ ఇవ్వాలని కోరినట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్
- తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- కువైట్ కాన్సులేట్ పై జరిగిన దాడిని ఖండించిన ఒమన్..!!
- పౌల్ట్రీ ఉత్పత్తుల ఆందోళనపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- ఖతార్ రియల్ దూకుడు.. సైలెంట్ మంత్ లోను వృద్ధి నమోదు..!!
- కాల్పుల విరమణ.. యూఏఈ ట్రావెల్ ఏజెన్సీలకు భారీగా పెరిగిన విచారణలు..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...









