ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్రెడ్డి భేటీ..
- December 26, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో ప్రధాని మోదీతో దాదాపు గంటపాటు ఏయే విషయాలపై చర్చించామన్న వివరాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు. విభజన చట్టం ప్రకారం సాధించాల్సిన ప్రయోజనాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాల్సిందిగా మోదీని కోరామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను అడిగామనన్నారు.
సమాఖ్య స్ఫూర్తిలో భాగంగా మోదీని కలిశామని భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెచ్చుకున్నామని అన్నారు. ఈ మూడు విషయాలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం తాత్సారం చేసిందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి గత సర్కారు నిధులు తీసుకురాలేకపోయిందని భట్టి విక్రమార్క అన్నారు. తాము విభజన హామీలను మోదీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరామని అన్నారు.
అలాగే, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గురించి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి విజ్ఞప్తులు చేశామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరామని అన్నారు. తెలంగాణకు ఒక ఐఐఎం, సైనిక్ స్కూల్ ఇవ్వాలని కోరినట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక







