యూఏఈ ట్రాఫిక్ తగ్గేందుకు స్కూల్స్ కు విజ్ఞప్తి
- December 29, 2023
యూఏఈ: ప్రస్తుతం సెలవులు కావడంతో స్థానికులు, వాహనదారులు ట్రాఫిక్ తక్కువగా ఉందని తెలిపారు. వచ్చే వారం మళ్లీ తరగతులు ప్రారంభమైనప్పుడు ట్రాఫిక్ సాఫీగా ఉండేందుకు పాఠశాలలు వివిధ సమయాలను పాటించాలని కొందరు సూచిస్తున్నారు. ట్రాఫిక్ లేనందున దాదాపు 20 శాతం సమయం ఆదా అవుతుందని దుబాయ్ నివాసి ఫెర్డినాండ్ ఫ్రాగా హర్షం వ్యక్తం చేశారు. దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్లో ఉన్న స్కూల్స్ టైమింగ్స్ వలన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని పేర్కొన్నారు. “పాఠశాలలు లేని సమయంలో భారీ ట్రాఫిక్ ఉండదు. పాఠశాలలకు వేర్వేరు సమయాలను పాటించడం వలన ట్రాఫిక్ కు ఒక పరిష్కారం అని లభిస్తుందని భావిస్తున్నాను. కాబట్టి విద్యార్థులు అందరూ ఒకే సమయంలో రాకపోవడం వలన కార్ల సంఖ్య తగ్గుతుంది. ” అని వివరించారు. మరోవైపు అల్ బార్షా సౌత్లోని బ్లూమ్ వరల్డ్ అకాడమీ వ్యవస్థాపక ప్రిన్సిపాల్ జాన్ బెల్ మాట్లాడుతూ.. యూఏఈలో ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే స్కూల్స్ కారణంగా తక్కువ ఒత్తిడి, తక్కువ ట్రాఫిక్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. "విద్యార్థులు చాలా ముందుగానే లేవవలసి వచ్చినప్పుడు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. యూఏఈలో చాలా సందర్భాలలో ఉదయం 5.30 లేదా ముందుగానే పాఠశాల బస్సులు వారిని ఎక్కించుకున్నప్పుడు ఇది వారి మొత్తం ఆరోగ్యం, శ్రద్ధ, ప్రవర్తన మరియు ఉత్పాదకతపై హానికరమైన ప్రభావాలను చూపుతుంది.” అని షార్జాలోని NMC మెడికల్ సెంటర్లోని స్పెషలిస్ట్ శిశువైద్యుడు డాక్టర్ సంజయ్ ఉధాని తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







