యూఏఈ ట్రాఫిక్ తగ్గేందుకు స్కూల్స్ కు విజ్ఞప్తి
- December 29, 2023
యూఏఈ: ప్రస్తుతం సెలవులు కావడంతో స్థానికులు, వాహనదారులు ట్రాఫిక్ తక్కువగా ఉందని తెలిపారు. వచ్చే వారం మళ్లీ తరగతులు ప్రారంభమైనప్పుడు ట్రాఫిక్ సాఫీగా ఉండేందుకు పాఠశాలలు వివిధ సమయాలను పాటించాలని కొందరు సూచిస్తున్నారు. ట్రాఫిక్ లేనందున దాదాపు 20 శాతం సమయం ఆదా అవుతుందని దుబాయ్ నివాసి ఫెర్డినాండ్ ఫ్రాగా హర్షం వ్యక్తం చేశారు. దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్లో ఉన్న స్కూల్స్ టైమింగ్స్ వలన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని పేర్కొన్నారు. “పాఠశాలలు లేని సమయంలో భారీ ట్రాఫిక్ ఉండదు. పాఠశాలలకు వేర్వేరు సమయాలను పాటించడం వలన ట్రాఫిక్ కు ఒక పరిష్కారం అని లభిస్తుందని భావిస్తున్నాను. కాబట్టి విద్యార్థులు అందరూ ఒకే సమయంలో రాకపోవడం వలన కార్ల సంఖ్య తగ్గుతుంది. ” అని వివరించారు. మరోవైపు అల్ బార్షా సౌత్లోని బ్లూమ్ వరల్డ్ అకాడమీ వ్యవస్థాపక ప్రిన్సిపాల్ జాన్ బెల్ మాట్లాడుతూ.. యూఏఈలో ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే స్కూల్స్ కారణంగా తక్కువ ఒత్తిడి, తక్కువ ట్రాఫిక్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. "విద్యార్థులు చాలా ముందుగానే లేవవలసి వచ్చినప్పుడు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. యూఏఈలో చాలా సందర్భాలలో ఉదయం 5.30 లేదా ముందుగానే పాఠశాల బస్సులు వారిని ఎక్కించుకున్నప్పుడు ఇది వారి మొత్తం ఆరోగ్యం, శ్రద్ధ, ప్రవర్తన మరియు ఉత్పాదకతపై హానికరమైన ప్రభావాలను చూపుతుంది.” అని షార్జాలోని NMC మెడికల్ సెంటర్లోని స్పెషలిస్ట్ శిశువైద్యుడు డాక్టర్ సంజయ్ ఉధాని తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







