యూఏఈ ట్రాఫిక్ తగ్గేందుకు స్కూల్స్ కు విజ్ఞప్తి
- December 29, 2023
యూఏఈ: ప్రస్తుతం సెలవులు కావడంతో స్థానికులు, వాహనదారులు ట్రాఫిక్ తక్కువగా ఉందని తెలిపారు. వచ్చే వారం మళ్లీ తరగతులు ప్రారంభమైనప్పుడు ట్రాఫిక్ సాఫీగా ఉండేందుకు పాఠశాలలు వివిధ సమయాలను పాటించాలని కొందరు సూచిస్తున్నారు. ట్రాఫిక్ లేనందున దాదాపు 20 శాతం సమయం ఆదా అవుతుందని దుబాయ్ నివాసి ఫెర్డినాండ్ ఫ్రాగా హర్షం వ్యక్తం చేశారు. దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్లో ఉన్న స్కూల్స్ టైమింగ్స్ వలన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని పేర్కొన్నారు. “పాఠశాలలు లేని సమయంలో భారీ ట్రాఫిక్ ఉండదు. పాఠశాలలకు వేర్వేరు సమయాలను పాటించడం వలన ట్రాఫిక్ కు ఒక పరిష్కారం అని లభిస్తుందని భావిస్తున్నాను. కాబట్టి విద్యార్థులు అందరూ ఒకే సమయంలో రాకపోవడం వలన కార్ల సంఖ్య తగ్గుతుంది. ” అని వివరించారు. మరోవైపు అల్ బార్షా సౌత్లోని బ్లూమ్ వరల్డ్ అకాడమీ వ్యవస్థాపక ప్రిన్సిపాల్ జాన్ బెల్ మాట్లాడుతూ.. యూఏఈలో ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే స్కూల్స్ కారణంగా తక్కువ ఒత్తిడి, తక్కువ ట్రాఫిక్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. "విద్యార్థులు చాలా ముందుగానే లేవవలసి వచ్చినప్పుడు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. యూఏఈలో చాలా సందర్భాలలో ఉదయం 5.30 లేదా ముందుగానే పాఠశాల బస్సులు వారిని ఎక్కించుకున్నప్పుడు ఇది వారి మొత్తం ఆరోగ్యం, శ్రద్ధ, ప్రవర్తన మరియు ఉత్పాదకతపై హానికరమైన ప్రభావాలను చూపుతుంది.” అని షార్జాలోని NMC మెడికల్ సెంటర్లోని స్పెషలిస్ట్ శిశువైద్యుడు డాక్టర్ సంజయ్ ఉధాని తెలిపారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









