2024లో ఒమన్ లో యూనిఫైడ్ తనిఖీ యూనిట్ ప్రారంభం
- December 29, 2023
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ (SSE) ఒప్పందం ఆధారంగా ఏర్పడిన లేబర్ మార్కెట్ యూనిఫైడ్ తనిఖీ యూనిట్ 2024 ప్రారంభం కానుంది. ఇది నిబంధనలకు అనుగుణంగా లేని సంస్థలు, పత్రాలు లేని కార్మికులపై చర్యలు చేపడుతుంది. ఈ నెల ప్రారంభంలో లేబర్ అండ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కార్పొరేషన్ మంత్రిత్వ శాఖ తనిఖీ కార్యకలాపాల నాణ్యత, సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో తనిఖీ యూనిట్ను ప్రారంభించేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. డోఫర్ గవర్నరేట్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ డైరెక్టర్ జనరల్ నాసర్ బిన్ సలేం అల్ హధ్రామి మాట్లాడుతూ.. కార్మిక చట్టాన్ని ఉల్లంఘించే కార్మికులను అరెస్టు చేయడంలో కార్మిక మంత్రిత్వ శాఖతో అనుబంధంగా ఉన్న తనిఖీ బృందానికి తనిఖీ యూనిట్ భద్రతా మద్దతు యూనిట్గా ఉంటుందని స్పష్టం చేశారు. తనిఖీ యూనిట్ చట్టవిరుద్ధమైన కార్మికులు, సంచరించే కార్మికులు మరియు లేబర్ మార్కెట్ను నియంత్రించే చట్టాలను ఉల్లంఘించే ఇతర వ్యక్తులను నియంత్రించేందుకు తనిఖీ ప్రచారాలను తీవ్రతరం చేస్తుందన్నారు. దీంతోపాటు దేశం నుండి బహిష్కరణకు గురైన సందర్భంలో కార్మిక వ్యవహారాల కేంద్రాలు, పోలీసు స్టేషన్లు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయాలు లేదా విమానాశ్రయానికి వారిని తరలించేందుకు ఈ యూనిట్ సహాయంగా నిలుస్తుందన్నారు.
తాజా వార్తలు
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక







