2024లో ఒమన్ లో యూనిఫైడ్ తనిఖీ యూనిట్ ప్రారంభం
- December 29, 2023
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ (SSE) ఒప్పందం ఆధారంగా ఏర్పడిన లేబర్ మార్కెట్ యూనిఫైడ్ తనిఖీ యూనిట్ 2024 ప్రారంభం కానుంది. ఇది నిబంధనలకు అనుగుణంగా లేని సంస్థలు, పత్రాలు లేని కార్మికులపై చర్యలు చేపడుతుంది. ఈ నెల ప్రారంభంలో లేబర్ అండ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కార్పొరేషన్ మంత్రిత్వ శాఖ తనిఖీ కార్యకలాపాల నాణ్యత, సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో తనిఖీ యూనిట్ను ప్రారంభించేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. డోఫర్ గవర్నరేట్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ డైరెక్టర్ జనరల్ నాసర్ బిన్ సలేం అల్ హధ్రామి మాట్లాడుతూ.. కార్మిక చట్టాన్ని ఉల్లంఘించే కార్మికులను అరెస్టు చేయడంలో కార్మిక మంత్రిత్వ శాఖతో అనుబంధంగా ఉన్న తనిఖీ బృందానికి తనిఖీ యూనిట్ భద్రతా మద్దతు యూనిట్గా ఉంటుందని స్పష్టం చేశారు. తనిఖీ యూనిట్ చట్టవిరుద్ధమైన కార్మికులు, సంచరించే కార్మికులు మరియు లేబర్ మార్కెట్ను నియంత్రించే చట్టాలను ఉల్లంఘించే ఇతర వ్యక్తులను నియంత్రించేందుకు తనిఖీ ప్రచారాలను తీవ్రతరం చేస్తుందన్నారు. దీంతోపాటు దేశం నుండి బహిష్కరణకు గురైన సందర్భంలో కార్మిక వ్యవహారాల కేంద్రాలు, పోలీసు స్టేషన్లు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయాలు లేదా విమానాశ్రయానికి వారిని తరలించేందుకు ఈ యూనిట్ సహాయంగా నిలుస్తుందన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







