'యంగ్ టైగర్' చెన్నైలో సందడి..
- May 29, 2016
'యంగ్ టైగర్' జూనియర్ ఎన్టీఆర్ చెన్నైలో సందడి చేస్తున్నారు. తనను కలిసిన అభిమానులకు ఆనందాన్ని పంచారు. ఆయన ప్రస్తుతం 'జనతా గ్యారేజి' చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, నిత్యామేనన్లు ఆయన సరసన ఆడిపాడుతున్నారు. దీని చిత్రీకరణ కోసం ఇటీవల చెన్నై వచ్చారు. ఆదివారం జీహెచ్ ఎదురుగా ఉన్న మెమోరియల్ హాలు వద్ద చిత్రీకరణ సాగింది. ఉదయం నగరంలోని అభిమానుల సంఘం ప్రతినిధులు ఆయన్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కేకు కత్తిరించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జయలలితకు అభినందనలు తెలిపేందుకు ఆమె అపాయింట్మెంట్ కోసం ఎన్టీఆర్ వేచి చూస్తున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఆమెను కలిసే అవకాశమున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







