అయోధ్యలో 'బాల రాముడు' విగ్రహం ఎంపిక..
- January 02, 2024
అయోధ్య: ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరం మరి కొన్ని రోజుల్లోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలోనే గర్భగుడిలో ప్రతిష్ఠించే విగ్రహం ఏవిధంగా ఉంటుందన్న విషయంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
మూడు విగ్రహాలను సిద్ధం చేయగా.. అందులో కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వెల్లడించారు. రాష్ట్రంలోని రామభక్తుల ఆనందాన్ని ఇది రెట్టింపు చేసినట్లు ట్వీట్ చేశారు.
అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం గర్భగుడిలో 51 అంగుళాల ఎత్తుతో బాల రాముడి విగ్రహం ప్రతిష్ఠించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఇదివరకే వెల్లడించింది. ఇందుకోసం మూడు విగ్రహాలను తయారు చేయించింది. వీటిలో ఒకదాన్ని ఎంపిక చేసేందుకు ఇటీవల బోర్డు సమావేశంలో ఓటింగ్ నిర్వహించింది. రామాలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జనవరి 16 నుంచే మొదలుకానున్నాయి. 17న బాల రాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువస్తారు. 22న మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించనున్నట్లు ట్రస్టు కార్యదర్శి చంపత్రాయ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







