అయోధ్యలో 'బాల రాముడు' విగ్రహం ఎంపిక..
- January 02, 2024
అయోధ్య: ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరం మరి కొన్ని రోజుల్లోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలోనే గర్భగుడిలో ప్రతిష్ఠించే విగ్రహం ఏవిధంగా ఉంటుందన్న విషయంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
మూడు విగ్రహాలను సిద్ధం చేయగా.. అందులో కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వెల్లడించారు. రాష్ట్రంలోని రామభక్తుల ఆనందాన్ని ఇది రెట్టింపు చేసినట్లు ట్వీట్ చేశారు.
అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం గర్భగుడిలో 51 అంగుళాల ఎత్తుతో బాల రాముడి విగ్రహం ప్రతిష్ఠించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఇదివరకే వెల్లడించింది. ఇందుకోసం మూడు విగ్రహాలను తయారు చేయించింది. వీటిలో ఒకదాన్ని ఎంపిక చేసేందుకు ఇటీవల బోర్డు సమావేశంలో ఓటింగ్ నిర్వహించింది. రామాలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జనవరి 16 నుంచే మొదలుకానున్నాయి. 17న బాల రాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువస్తారు. 22న మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించనున్నట్లు ట్రస్టు కార్యదర్శి చంపత్రాయ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







