కాంగ్రెస్ గూటికి వైఎస్ షర్మిల..
- January 02, 2024
అమరావతి: వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇందు కోసం ముహూర్తం ఫిక్స్ అయింది. 4వ తేదీన ఢిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నుంచి షర్మిలకు ఆహ్వానం అందింది. రేపు లేదా ఎల్లుండి షర్మిల ఢిల్లీ వెళ్తారు. 4వ తేదీ ఉదయం 11 గంటలకు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు. షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే, షర్మిలకు ఏఐసీసీ పదవి అప్పగిస్తారా? ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగిస్తారా? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతుంది. రాహుల్ గాంధీ షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అలాకాకుంటే ఏఐసీసీ, సిడబ్ల్యుసీలో ఏదైనా ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలాఉంటే.. ఖర్గే నుంచి ఫోన్ రాగానే అందుబాటులో వైఎస్ఆర్టీపీ నాయకులు, కార్యకర్తలతో మంగళవారం ఉదయం షర్మిల లోటస్ పాండ్ లో భేటీ అయ్యారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం ఎందుకు చేయాల్సి వస్తుందనే విషయాలపై షర్మిల వారికి వివరించనున్నారు. దీనికితోడు షర్మిల ఏపీ కాంగ్రెస్ రాజకీయాల్లోకి వెళితే తెలంగాణలోని వైఎస్ఆర్టీపీ నేతలు, కార్యకర్తల భవిష్యత్తు ఏమిటి? కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుందనే విషయాలపై ఈ భేటీలో నేతలతో షర్మిల చర్చించినట్లు సమాచారం. అయితే, ఈ సమావేశంలో ఏపీ కాంగ్రెస్ లో ఏ బాధ్యతలు స్వీకరించబోతున్నారని పార్టీ నేతలు ప్రస్తావించగా.. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నానని షర్మిల చెప్పినట్లు తెలిసింది. సమావేశం అనంతరం షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు. 4వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని, వైఎసఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరుగుతుందని షర్మిల తెలిపారు.
వైఎస్ షర్మిల మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి కడప వెళ్తారు. అక్కడ నుంచి సాయంత్రం 4గంటలకు ఇడుపులపాయ చేరుకొని తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియాలకు వివాహం నిశ్చమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. నూతన వధూవరులు, కుటుంబ సభ్యులతో కలిసి షర్మిల వైఎస్ఆర్ ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ కార్యక్రమం తరువాత కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం, కాంగ్రెస్ పార్టీలో చేరికపై షర్మిల స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!









