టీ20 ప్రపంచకప్ కోసం 25 నుంచి 30 మంది ఆటగాళ్లతో షార్ట్ లిస్ట్
- January 02, 2024
టీ20 ప్రపంచకప్ పై భారత్ దృష్టి సారింది. వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టును ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన అనంతరం ఎంపిక చేయనున్నారు.
కాగా.. ఇప్పటికే ఈ మెగా టోర్నీ పై దృష్టి సారించిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 25 నుంచి 30 మంది ఆటగాళ్లను షార్ట్లిస్ట్ చేయాలనే నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఈ ఆటగాళ్లను ఐపీఎల్ సీజన్ మొత్తం పర్యవేక్షించనున్నారని, ఆ తరువాత వీరిలోంచి జట్టును ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిలో స్టార్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లు ఉండనున్నారనే వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి 2022 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీమ్ఇండియా తరుపున మరో టీ20 మ్యాచ్ ఆడలేదు. ఈ విషయమై వీరిద్దరితో మాట్లాడడంతో పాటు షార్ట్ లిస్టులో ఎవరెవరిని ఎంపిక చేయాలనే విషయమై కోచ్ రాహుల్ ద్రవిడ్తో చర్చించేందుకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కేప్టౌన్కు వెళ్లనున్నారు. ప్రతి స్థానానికి కనీసం ఇద్దరు ఆటగాళ్లతో పెద్ద పూల్ను తయారు చేయనున్నారు. ఒకవేళ ఎవరైనా ఆటగాడు గాయపడిన ప్రత్యామ్నాయ ఆటగాడి ఎంపికకు ఇబ్బంది లేకుండా కసరత్తులు చేస్తున్నారు. షార్ట్లిస్ట్లోని ఆటగాళ్లందరినీ నేషనల్ క్రికెట్ అకాడమీ ఫిజియోలు, బీసీసీఐ వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది.
ప్రస్తుతానికి సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య లు ఫిట్గా లేరు. గాయాల నుంచి కోలుకుంటున్నారు. వీరిద్దరు అఫ్గాన్ సిరీస్లో ఆడే విషయమైన ఇప్పటికైతే ఖచ్చితమైన సమాచారం లేదు. ఐపీఎల్ సమయానికి వీరిద్దరి ఫిట్నెస్తో పాటు ఎవరెవరు టీ20 ప్రపంచకప్లో బరిలోకి దిగుతారు అనే విషయమై స్పష్టత వస్తుందని ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి వెల్లడించారు.
తాజా వార్తలు
- పిల్లల స్క్రీన్ టైమ్పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- సైనిక స్థావరాల్లో రక్షణ మంత్రి తనిఖీలు.. సైన్యం సన్నద్ధతపై సమీక్ష..
- దుబాయ్లో కొత్త అల్ ఖుద్రా బ్రిడ్జి ప్రారంభం..
- బోనాల ఉత్సవాల్లో AI కెమెరాలతో అప్రమత్తమైన నిఘా:సీపీ సజ్జనార్
- రియాద్లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి.. లక్ష్మీనారాయణకు తెలుగు సంఘాల అండ
- వైజాగ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్..







