170 ప్రైవేట్ స్కూళ్లలో సైబర్ సెక్యూరిటీ పాఠాలు
- January 03, 2024
దోహా: జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA), విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) భాగస్వామ్యంతో మొదటి దశలో 170 ప్రైవేట్ పాఠశాలల్లో సైబర్ సెక్యూరిటీ ఎడ్యుకేషనల్ కరిక్యులం అమలు చేయనున్నారు. తదుపరి దశలో మరో 100 ప్రైవేట్ పాఠశాలలకు విస్తరిస్తారు. డిజిటల్గా సురక్షితమైన సమాజాన్ని నిర్మించడానికి 2023లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన తర్వాత ప్రైవేట్ పాఠశాలల్లో ఎడ్యుకేషనల్ సైబర్సెక్యూరిటీ పాఠ్యాంశాలను అమలు చేయడం జరుగుతుంది. సైబర్సెక్యూరిటీ ఎడ్యుకేషనల్ కరిక్యులం డిజిటల్ ప్రపంచంతో సురక్షితంగా, ప్రభావవంతంగా వ్యవహరించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న కొత్త తరాన్ని నిర్మించడం, సైబర్సెక్యూరిటీ మరియు డిజిటల్ భద్రతకు సంబంధించిన వివిధ భావనలపై స్కూల్ పిల్లలలకు అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు MoEHEలోని ప్రైవేట్ విద్యా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ఒమర్ అబ్దుల్ అజీజ్ అల్ నైమా స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ మొదటి దశలో 80 ప్రభుత్వ పాఠశాలలలో అమలు చేశారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









