170 ప్రైవేట్ స్కూళ్లలో సైబర్ సెక్యూరిటీ పాఠాలు
- January 03, 2024
దోహా: జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA), విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) భాగస్వామ్యంతో మొదటి దశలో 170 ప్రైవేట్ పాఠశాలల్లో సైబర్ సెక్యూరిటీ ఎడ్యుకేషనల్ కరిక్యులం అమలు చేయనున్నారు. తదుపరి దశలో మరో 100 ప్రైవేట్ పాఠశాలలకు విస్తరిస్తారు. డిజిటల్గా సురక్షితమైన సమాజాన్ని నిర్మించడానికి 2023లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన తర్వాత ప్రైవేట్ పాఠశాలల్లో ఎడ్యుకేషనల్ సైబర్సెక్యూరిటీ పాఠ్యాంశాలను అమలు చేయడం జరుగుతుంది. సైబర్సెక్యూరిటీ ఎడ్యుకేషనల్ కరిక్యులం డిజిటల్ ప్రపంచంతో సురక్షితంగా, ప్రభావవంతంగా వ్యవహరించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న కొత్త తరాన్ని నిర్మించడం, సైబర్సెక్యూరిటీ మరియు డిజిటల్ భద్రతకు సంబంధించిన వివిధ భావనలపై స్కూల్ పిల్లలలకు అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు MoEHEలోని ప్రైవేట్ విద్యా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ఒమర్ అబ్దుల్ అజీజ్ అల్ నైమా స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ మొదటి దశలో 80 ప్రభుత్వ పాఠశాలలలో అమలు చేశారు.
తాజా వార్తలు
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: అధ్యక్షుడు పెజె
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!







