170 ప్రైవేట్ స్కూళ్లలో సైబర్ సెక్యూరిటీ పాఠాలు
- January 03, 2024
దోహా: జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA), విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) భాగస్వామ్యంతో మొదటి దశలో 170 ప్రైవేట్ పాఠశాలల్లో సైబర్ సెక్యూరిటీ ఎడ్యుకేషనల్ కరిక్యులం అమలు చేయనున్నారు. తదుపరి దశలో మరో 100 ప్రైవేట్ పాఠశాలలకు విస్తరిస్తారు. డిజిటల్గా సురక్షితమైన సమాజాన్ని నిర్మించడానికి 2023లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన తర్వాత ప్రైవేట్ పాఠశాలల్లో ఎడ్యుకేషనల్ సైబర్సెక్యూరిటీ పాఠ్యాంశాలను అమలు చేయడం జరుగుతుంది. సైబర్సెక్యూరిటీ ఎడ్యుకేషనల్ కరిక్యులం డిజిటల్ ప్రపంచంతో సురక్షితంగా, ప్రభావవంతంగా వ్యవహరించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న కొత్త తరాన్ని నిర్మించడం, సైబర్సెక్యూరిటీ మరియు డిజిటల్ భద్రతకు సంబంధించిన వివిధ భావనలపై స్కూల్ పిల్లలలకు అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు MoEHEలోని ప్రైవేట్ విద్యా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ఒమర్ అబ్దుల్ అజీజ్ అల్ నైమా స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ మొదటి దశలో 80 ప్రభుత్వ పాఠశాలలలో అమలు చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







