ఒమన్లో చిత్రీకరించిన ‘రాస్తా’ జనవరి 5న విడుదల
- January 03, 2024
మస్కట్: పూర్తిగా ఒమన్లో చిత్రీకరించిన మలయాళంలో తొలి అంతర్జాతీయ చిత్రం ‘రాస్తా’ జనవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఇతివృత్తం దక్షిణ భారత రాష్ట్రమైన కేరళ కంటే పది రెట్లు ఉన్న రబ్ అల్ ఖలీ ఎడారి నేపథ్యంలో సాగుతుంది. ఇది తన తల్లిని వెతకడానికి గల్ఫ్కు వెళ్లే అమ్మాయి హృదయాన్ని కదిలించే కథగా నిర్మతలు తెలిపారు. చాలా మంది ఒమానీ పౌరులు కూడా సినిమాలో నటించినట్లు పేర్కొన్నారు. అనీష్ అన్వర్ దర్శకత్వం వహించిన సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం ‘రాస్తా’లో సర్జానో ఖలీద్, అనఘా నారాయణన్, ఆరాధ్య ఆన్, సుధీష్, ఇర్షాద్ అలీ, టి.జి. రవి, అనీష్ అన్వర్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.. ఏఎల్యూ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై లిను శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మేరకు ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినిమా నిర్మతలు పాల్గొని.. ఒమన్లో షూటింగ్లో తమ గొప్ప అనుభవాన్ని , మునుపటి సంఘటనల ఆధారంగా రూపొందించిన కథను వివరించారు. ఈ కార్యక్రమంలో ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్, ఫైసల్ బిన్ అబ్దుల్లా అల్ రావాస్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..