అగ్నిప్రమాదంలో గిడ్డంగుల దహనం
- May 29, 2016
భారీ అగ్ని ప్రమాదం కారణంగా షార్జా ఇండస్ట్రియల్ ఏరియాలో పలు వేర్ హౌస్లు (గిడ్డంగులు) దహనమయ్యాయి. షార్జా సివిల్ డిఫెన్స్ అధికారులు ప్రమాద వివరాల్ని వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇండస్ట్రియల్ ఏరియా 18లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షార్జా హెడ్ క్వార్టర్స్, మువైల్, సమ్నాన్, అల్ మినా నుంచి ఫైర్ ఫైటర్స్ తక్షణం ప్రమాద స్థలికి చేరుకుని, మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా తగిన చర్యలు చేపట్టామని అధికారులు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







