చమురుధరలతో యూఏఈ ఎకానమీ వృద్ధి
- May 29, 2016
చమురు ధరల రికవరీతో యూఏఈ ఎకానమీ వృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. బ్యారెల్ ముడిచమురు ధర 50 డాలర్లకు చేరడం పట్ల యూఏఈ ఎకానమీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీనియర్ అధికారి ఒకరు, తాజా పరిణామాలు యూఏఈ ఎకానమీకి ఊతమిస్తాయని చెప్పారు. 30 డాలర్ల దిగువకు పడిపోయిన బ్యారెల్ ముడిచమురు ధర 50 డాలర్లకి చేరుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన అన్నారు. యూఏఈ, రోజుకి 2.8 మిలియన్ బ్యారల్స్ ఉత్పత్తి జరుగుతోందనీ, ఈ మొత్తాన్ని 3.5 మిలియన్ బ్యారెల్స్కి పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) సభ్యుడు చెప్పారు. ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ఒపెక్ మెంబర్స్, గురువారం సమావేశమవనున్నారు. రాజకీయాల్ని పక్కన పెట్టి, 'ఒపెక్' సమావేశంలో ప్రతి సభ్య దేశం పాల్గొనాల్సి ఉందని తద్వారా ఎకనామీని వృద్ధి చేసుకోవడంతోపాటు మార్కెట్ స్థితిగతులపై అవగాహన ఇంకా పెంచుకోడానికి అవకాశం కలుగుతుందని కమోడిటీ స్ట్రేటజీ - సాక్సో బ్యాంక్ హెడ్ ఓల్ హాన్సెన్ అభిప్రాయపడ్డారు.గత నెలలో దోహాలో జరిగిన సమావేశంలో ఓ అవగాహన కుదుర్చుకోవడంలో సభ్య దేశాలు విఫలమయ్యాయి. ఇరాన్, సమావేశంలో పాల్గొనకపోవడాన్ని సౌదీ అరేబియా తప్పుపడుతోంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







