దోహా ఎక్స్పోలో లోకల్ అగ్రి ఫెస్టివల్ ప్రారంభం
- January 04, 2024
దోహా : దోహాలోని ఫార్మర్స్ జోన్ ఆఫ్ ఎక్స్పో 2023లో లోకల్ అగ్రికల్చర్ ఫెస్టివల్ ప్రారంభమైంది. "ఖతార్ వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఎక్స్పో ఫెస్టివల్" మార్చి 2024 వరకు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. దాదాపు అన్ని రకాల స్థానిక కూరగాయలు మార్కెట్కు చేరుకోవడంతో ఖతార్ వ్యవసాయ సీజన్ గరిష్ట స్థాయికి చేరుకుంటున్న తరుణంలో వ్యవసాయ వ్యవహారాల శాఖ ప్రాతినిధ్యం వహిస్తున్న మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ఈ ఫెస్టివల్ ను ప్రకటించింది. సాధారణంగా ఖతార్లో అత్యధిక వ్యవసాయ సీజన్ డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. స్థానిక పొలాల సంఖ్య పెరగడంతో, సీజనల్ మార్కెట్లు ఈ సీజన్లో 14,000 టన్నుల కూరగాయలను అందజేస్తాయని అంచనా. ఇది గత సీజన్ కంటే 20 శాతం ఎక్కువ కావడం విశేషం.
తాజా వార్తలు
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు









