కిరణ్ అబ్బవరం దూకుడు తగ్గేదేలే.!
- January 09, 2024
‘రాజావారు రాణివారు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమైన కుర్రోడు కిరణ్ అబ్బవరం. చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సైతం వదులుకుని సినిమాపై ప్యాషన్తో ఇండస్ర్టీలోకి అడుగుపెట్టాడు.
తొలి సినిమాతో సమ్థింగ్ స్పెషల్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత ‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ , రూల్స్ రంజన్’ తదితర సినిమాలతో యూత్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడీ యంగ్స్టర్.
మరీ సక్సెస్ఫుల్ హీరో అనలేం కానీ, వరుసగా అవకాశాలు మాత్రం కిరణ్ అబ్బవరాన్ని తట్టి లేపుతూనే వున్నాయ్ సక్సెస్ ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా.
ఈ ఏడాది రెండు సినిమాలు ఆల్రెడీ లైన్లో పెట్టేశాడు. అందులో ఒకటి కరుణ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా. ఇంకో సినిమా కోసం సందీప్ - సుజిత్ అనే ఇద్దరు దర్శకులతో పని చేస్తున్నాడు.
ఈ సినిమా 1980 పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతోంది. పోస్ట్మెన్ క్యారెక్టర్లో కిరణ్ అబ్బవరం నటించబోతున్నాడనీ తెలుస్తోంది. పోస్ట్మెన్ గెటప్లో ఇప్పటికే పలువురు హీరోలు తెలుగు తెరపై సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే, డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కబోయే ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం కొత్తగా ఏం చెప్పబోతున్నాడో చూడాలి మరి. ఈ ఏడాదిలోనే ఈ రెండు సినిమాలూ రిలీజ్ కాబోతున్నాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్..
- 17 మంది ప్రాణాలు తీసిన ఏసీ కంప్రెషర్!
- మిస్ వరల్డ్ కంటెస్టంట్లను అలరించిన సెక్రటేరియట్ డ్రోన్ షో
- కారు డోర్ లాక్–నలుగురు చిన్నారులు మృతి
- తన ఆత్మకథ పుస్తకావిష్కరణకు రావలసిందిగా రేవంత్,చంద్రబాబు కు బండారు దత్తాత్రేయ ఆహ్వానం
- త్వరలో తిరుపతిలో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్
- ఐపీఎల్ అభిమానులకు జైన్ కువైట్ బంపరాఫర్.. KD1కే స్ట్రీమింగ్ ఆఫర్..!!
- గ్యాస్ సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం.. భారతీయ దంపతులు మృతి..!!
- మస్కట్లో భారతీయుడు సహా నలుగురు శ్రీలంక ప్రవాసులు అరెస్ట్.. !!
- ట్రంప్ మిడ్ ఈస్ట్ పర్యటన: $2 ట్రిలియన్లకు పైగా బిజినెస్ ఒప్పందాలు..!!