కిరణ్ అబ్బవరం దూకుడు తగ్గేదేలే.!
- January 09, 2024
‘రాజావారు రాణివారు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమైన కుర్రోడు కిరణ్ అబ్బవరం. చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సైతం వదులుకుని సినిమాపై ప్యాషన్తో ఇండస్ర్టీలోకి అడుగుపెట్టాడు.
తొలి సినిమాతో సమ్థింగ్ స్పెషల్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత ‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ , రూల్స్ రంజన్’ తదితర సినిమాలతో యూత్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడీ యంగ్స్టర్.
మరీ సక్సెస్ఫుల్ హీరో అనలేం కానీ, వరుసగా అవకాశాలు మాత్రం కిరణ్ అబ్బవరాన్ని తట్టి లేపుతూనే వున్నాయ్ సక్సెస్ ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా.
ఈ ఏడాది రెండు సినిమాలు ఆల్రెడీ లైన్లో పెట్టేశాడు. అందులో ఒకటి కరుణ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా. ఇంకో సినిమా కోసం సందీప్ - సుజిత్ అనే ఇద్దరు దర్శకులతో పని చేస్తున్నాడు.
ఈ సినిమా 1980 పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతోంది. పోస్ట్మెన్ క్యారెక్టర్లో కిరణ్ అబ్బవరం నటించబోతున్నాడనీ తెలుస్తోంది. పోస్ట్మెన్ గెటప్లో ఇప్పటికే పలువురు హీరోలు తెలుగు తెరపై సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే, డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కబోయే ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం కొత్తగా ఏం చెప్పబోతున్నాడో చూడాలి మరి. ఈ ఏడాదిలోనే ఈ రెండు సినిమాలూ రిలీజ్ కాబోతున్నాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









