కువైట్ లో త్వరలో నర్సుల నియామకాలు!
- January 10, 2024
కువైట్: కొత్త ఆసుపత్రులు, వైద్య కేంద్రాల కోసం స్థానిక లేదా బాహ్య కాంట్రాక్టుల ద్వారా వందలాది మంది నర్సులను నియమించుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అధికారిక నివేదిక ప్రకారం.. 2,000 మంది నర్సులను రిక్రూట్ చేయనున్నట్లు తెలుస్తుంది. నియామకాల ప్రణాళికను అధికారికంగా ఆమోదించిన తర్వాత భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వియత్నాం మరియు ఫిలిప్పీన్స్లకు చెందిన విదేశీ నర్సింగ్ బృందాలతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు కువైట్ లో నర్సులను ప్రొత్సహించేందుకు అదనపు ఆర్థిక బహుమతులు, ప్రోత్సాహకాలతో జాతీయ నర్సింగ్ కేడర్లకు మద్దతు ఇవ్వాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన ఆసుపత్రులు, కేంద్రాలలో 22,021 మంది నర్సులు పనిచేస్తున్నారు. వీరిలో 1,004 మంది కువైటీలు ( 4.6 శాతం) ఉండగా.. 21,017 మంది ప్రవాసులు (95.4 శాతం) ఉన్నారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









