ఇండియన్ ఎంబసీలో ఘనంగా హిందీ దివస్
- January 12, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం జనవరి 10న ఎంబసీ ఆడిటోరియంలో "ప్రపంచ హిందీ దివస్"ని జరుపుకుంది. కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైక ఈ వేడుకను ప్రారంభించారు. ఇందులో అన్ని భారతీయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హిందీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబాసిడర్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ "హిందీ దివస్" సందేశాన్ని చదివి వినిపించారు. హిందీ దివాస్లో భాగంగా వ్యాస రచన, కవితా పఠనం, డిబేట్ వంటి వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లతో సత్కరించారు. ఇండియాలో జరిగిన CBSE నేషనల్ స్కూల్ గేమ్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కువైట్ విద్యార్థులను కూడా అంబాసిడర్ సత్కరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









