ఇండియన్ ఎంబసీలో ఘనంగా హిందీ దివస్
- January 12, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం జనవరి 10న ఎంబసీ ఆడిటోరియంలో "ప్రపంచ హిందీ దివస్"ని జరుపుకుంది. కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైక ఈ వేడుకను ప్రారంభించారు. ఇందులో అన్ని భారతీయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హిందీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబాసిడర్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ "హిందీ దివస్" సందేశాన్ని చదివి వినిపించారు. హిందీ దివాస్లో భాగంగా వ్యాస రచన, కవితా పఠనం, డిబేట్ వంటి వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లతో సత్కరించారు. ఇండియాలో జరిగిన CBSE నేషనల్ స్కూల్ గేమ్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కువైట్ విద్యార్థులను కూడా అంబాసిడర్ సత్కరించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







