ఇండియన్ ఎంబసీలో ఘనంగా హిందీ దివస్
- January 12, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం జనవరి 10న ఎంబసీ ఆడిటోరియంలో "ప్రపంచ హిందీ దివస్"ని జరుపుకుంది. కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైక ఈ వేడుకను ప్రారంభించారు. ఇందులో అన్ని భారతీయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హిందీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబాసిడర్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ "హిందీ దివస్" సందేశాన్ని చదివి వినిపించారు. హిందీ దివాస్లో భాగంగా వ్యాస రచన, కవితా పఠనం, డిబేట్ వంటి వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లతో సత్కరించారు. ఇండియాలో జరిగిన CBSE నేషనల్ స్కూల్ గేమ్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కువైట్ విద్యార్థులను కూడా అంబాసిడర్ సత్కరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







