ఇండియన్ ఎంబసీలో ఘనంగా హిందీ దివస్

- January 12, 2024 , by Maagulf
ఇండియన్ ఎంబసీలో ఘనంగా హిందీ దివస్

కువైట్: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం జనవరి 10న ఎంబసీ ఆడిటోరియంలో "ప్రపంచ హిందీ దివస్"ని జరుపుకుంది. కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైక ఈ వేడుకను ప్రారంభించారు. ఇందులో అన్ని భారతీయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హిందీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబాసిడర్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ "హిందీ దివస్" సందేశాన్ని చదివి వినిపించారు. హిందీ దివాస్‌లో భాగంగా వ్యాస రచన, కవితా పఠనం, డిబేట్ వంటి వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లతో సత్కరించారు. ఇండియాలో జరిగిన CBSE నేషనల్ స్కూల్ గేమ్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కువైట్ విద్యార్థులను కూడా అంబాసిడర్ సత్కరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com