యూఏఈలో కొత్త సిస్టం.. ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత. ఫ్రోజెన్ ఫండ్స్ రిలీజ్
- January 16, 2024
యూఏఈ: ఇప్పుడు అన్ని న్యాయపరమైన అమలు నిర్ణయాలను తక్షణమే ట్రాక్ చేసేందుకు యూఏఈ కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. అబుదాబి జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ చెల్లింపు స్థితిని ట్రాక్ చేసే కొత్త సిస్టమ్ను ప్రకటించింది. దీని ప్రకారం.. ప్రతివాది పేమెంట్ చేయగానే.. సంబంధిత అధికారులకు పంపబడుతుంది. దీంతో వ్యక్తులు స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేకుండానే వారిపై ఉన్న ఆదేశాలు రద్దవుతాయి. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, న్యాయమూర్తుల జోక్యం లేకుండా ప్రక్రియ సజావుగా సాగుతుంది. గతంలో డ్యూస్ పేమెంట్ చేయని కారణంగా ప్రయాణ నిషేధం విధించబడిన సందర్భంలో ప్రతివాదులు స్మార్ట్ యాప్ ద్వారా రద్దు నిర్ణయం కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా చెల్లించని కారణంగా అరెస్ట్ వారెంట్ జారీ చేయబడిన సందర్భాల్లో లేదా నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైనందున డిపాజిట్లు, బ్యాంకు ఖాతాలపై ఏదైనా జప్తు ఉత్తర్వులు జారీ చేయబడితే, పేమెంట్ కాగానే అవి ఆటోమెటిక్ గా రద్దవుతాయి. ఈ కొత్త సిస్టమ్ అంతర్గతంగా నిర్మించిన డిజిటల్ సిస్టమ్ ద్వారా న్యాయమూర్తులు, అధికారులకు ఆటోమెటిక్ పద్ధతిలో తెలియజేస్తుంది. అలాగే ప్రతివాది కేసుపై తదుపరి చర్యలు, పర్యవేక్షణ గురించి అప్డేట్ అవుతుంది. ఈ విషయాన్ని సంబంధిత పార్టీలకు తెలియజేయబడుతుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







