దర్శకత్వం చేయబోతున్నా మంజుల..
- May 30, 2016
ముఖ కథానాయకుడు మహేష్బాబు సోదరి మంజుల ఇప్పటి వరకు నిర్మాతగా, నటిగా మాత్రమే తెలుసు. త్వరలో ఆమె మెగాఫోన్ చేతపట్టి దర్శకత్వం కూడా చేయబోతున్నారు. నాని కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు మంజుల సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. మహేష్ కథానాయకుడిగా నటించిన 'నాని', 'పోకిరి'తో పాటు 'షో', 'కావ్యాస్ డైరీ', 'ఏమాయ చేసావె' తదితర చిత్రాల్ని నిర్మించారు మంజుల. 'షో', 'కావ్యాస్ డైరీ' లాంటి చిత్రాల్లో నటనతోనూ మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. ఇప్పుడు దర్శకత్వంపై దృష్టి పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







