దర్శకత్వం చేయబోతున్నా మంజుల..
- May 30, 2016
ముఖ కథానాయకుడు మహేష్బాబు సోదరి మంజుల ఇప్పటి వరకు నిర్మాతగా, నటిగా మాత్రమే తెలుసు. త్వరలో ఆమె మెగాఫోన్ చేతపట్టి దర్శకత్వం కూడా చేయబోతున్నారు. నాని కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు మంజుల సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. మహేష్ కథానాయకుడిగా నటించిన 'నాని', 'పోకిరి'తో పాటు 'షో', 'కావ్యాస్ డైరీ', 'ఏమాయ చేసావె' తదితర చిత్రాల్ని నిర్మించారు మంజుల. 'షో', 'కావ్యాస్ డైరీ' లాంటి చిత్రాల్లో నటనతోనూ మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. ఇప్పుడు దర్శకత్వంపై దృష్టి పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









