35 మందికి యావజ్జీవం : ఈజిప్ట్
- May 30, 2016
ఈజిప్ట్లోని నిషేధిత సంస్థ ముస్లిం బ్రదర్హుడ్ అధినేత మహ్మద్బడీ, మరో 35 మందికి ఇక్కడి కోర్టు యావజ్జీవిత జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. 2013లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన మోర్సీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు హింసకు పాల్పడినట్లు వీరిపై అభియోగాలు నమోదయిన విషయం తెలిసిందే. 2013 జులైలో ముగ్గురి హత్యకు దారి తీసిన ఈ హింసాకాండలో భాగస్వాములయ్యారన్న ఆరోపణలతో 49 మందికి 3 నుండి పదిహేనేళ్ల జైలుశిక్ష విధించారు. 9 మంది నిందితులకు 15 ఏళ్లు, 20 మందికి పదేళ్లు, మరో 20 మందికి మూడేళ్ల వంతున జైలుశిక్ష విధించారని కోర్టు అధికారులు చెప్పారు. సరైన ఆధారాలు లేవంటూ 20 మందిని కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. 2013 జులైలో ఇస్లామియా నగరంలో ముస్లిం బ్రదర్హుడ్ సభ్యులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయాలపాలయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









