35 మందికి యావజ్జీవం : ఈజిప్ట్
- May 30, 2016
ఈజిప్ట్లోని నిషేధిత సంస్థ ముస్లిం బ్రదర్హుడ్ అధినేత మహ్మద్బడీ, మరో 35 మందికి ఇక్కడి కోర్టు యావజ్జీవిత జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. 2013లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన మోర్సీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు హింసకు పాల్పడినట్లు వీరిపై అభియోగాలు నమోదయిన విషయం తెలిసిందే. 2013 జులైలో ముగ్గురి హత్యకు దారి తీసిన ఈ హింసాకాండలో భాగస్వాములయ్యారన్న ఆరోపణలతో 49 మందికి 3 నుండి పదిహేనేళ్ల జైలుశిక్ష విధించారు. 9 మంది నిందితులకు 15 ఏళ్లు, 20 మందికి పదేళ్లు, మరో 20 మందికి మూడేళ్ల వంతున జైలుశిక్ష విధించారని కోర్టు అధికారులు చెప్పారు. సరైన ఆధారాలు లేవంటూ 20 మందిని కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. 2013 జులైలో ఇస్లామియా నగరంలో ముస్లిం బ్రదర్హుడ్ సభ్యులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయాలపాలయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







