35 మందికి యావజ్జీవం : ఈజిప్ట్
- May 30, 2016
ఈజిప్ట్లోని నిషేధిత సంస్థ ముస్లిం బ్రదర్హుడ్ అధినేత మహ్మద్బడీ, మరో 35 మందికి ఇక్కడి కోర్టు యావజ్జీవిత జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. 2013లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన మోర్సీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు హింసకు పాల్పడినట్లు వీరిపై అభియోగాలు నమోదయిన విషయం తెలిసిందే. 2013 జులైలో ముగ్గురి హత్యకు దారి తీసిన ఈ హింసాకాండలో భాగస్వాములయ్యారన్న ఆరోపణలతో 49 మందికి 3 నుండి పదిహేనేళ్ల జైలుశిక్ష విధించారు. 9 మంది నిందితులకు 15 ఏళ్లు, 20 మందికి పదేళ్లు, మరో 20 మందికి మూడేళ్ల వంతున జైలుశిక్ష విధించారని కోర్టు అధికారులు చెప్పారు. సరైన ఆధారాలు లేవంటూ 20 మందిని కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. 2013 జులైలో ఇస్లామియా నగరంలో ముస్లిం బ్రదర్హుడ్ సభ్యులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయాలపాలయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









