దుబాయ్-నార్తర్న్ ఎమిరేట్స్ మధ్య కొత్త ఫెడరల్ హైవే!
- January 25, 2024
యూఏఈ: మొత్తం ఏడు ఎమిరేట్లను కలుపుతూ కొత్త ఫెడరల్ హైవేని నిర్మించే ప్రతిపాదనను యూఏఈ పరిశీలిస్తుంది. ఇది పూర్తయితే పాన్-యూఏఈ హైవేల సంఖ్య నాలుగుకి చేరుకుంటుంది. ఇదివరకే అల్ ఇత్తిహాద్ (E11), షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ (E311) మరియు ఎమిరేట్స్ (E611) రోడ్లు ట్రాఫిక్ సమస్యను గణనీయంగా తగ్గించాయి. బుధవారం ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC)ని ఉద్దేశించి ఇంధనం మరియు మౌలిక సదుపాయాల మంత్రి సుహైల్ బిన్ మొహమ్మద్ అల్ మజ్రోయీ ప్రసంగించారు. ట్రాఫిక్ కష్టాలను తగ్గించడానికి కొత్త రహదారిని నిర్మించడానికి FNC సమర్పించిన ప్రతిపాదనను మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తుందని ఆయన చెప్పారు. ముఖ్యంగా దీని ద్వారా నార్తర్న్ ఎమిరేట్స్లో నివసిస్తూ దుబాయ్లో పనిచేసే ఉద్యోగులకు మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. అల్ ఇతిహాద్, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ మరియు ఎమిరేట్స్ రోడ్లు ప్రస్తుతం 20 కంటే తక్కువ లేన్లను కలిగి ఉన్నాయి. దుబాయ్లోకి ప్రవేశించడానికి దాదాపు 10 లేన్లు ఉన్నాయి. ఈ రోడ్లు దుబాయ్-నార్తర్న్ ఎమిరేట్స్ మధ్య 850,000 వాహనాలు ప్రయాణిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









