ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- April 08, 2026
న్యూ ఢిల్లీ: భారతదేశంలోని ప్రముఖ విమానయాన శిక్షణా సంస్థ ‘చెన్నైస్ అమృత ఇంటర్నేషనల్ ఏవియేషన్ కాలేజ్’, విమానయాన రంగంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను విద్యార్థులకు అందించే దిశగా అడుగులు వేస్తోంది. మలేషియా వర్సిటీతో చేతులు కలిపిన చెన్నైస్ అమృత విమానయాన రంగంలో గ్లోబల్ ఎక్స్పోజర్ను విద్యార్థుల ముంగిటకే తీసుకురావడానికి చెన్నైస్ అమృత ఇంటర్నేషనల్ ఏవియేషన్ కాలేజ్, యూనికామ్ (UniCAM) మలేషియాతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. చెన్నైలో ఏప్రిల్ 8, 2026న జరిగిన ఈ కార్యక్రమంలో ఇరు సంస్థల ప్రతినిధులు అవగాహన ఒప్పందం (MoU)పై సంతకాలు చేశారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా విద్యార్థులు మలేషియా నిపుణుల సమక్షంలో శిక్షణ పొందడమే కాకుండా, ఏవియేషన్ 4.0, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), విమానాశ్రయ కార్యకలాపాలు వంటి ఆధునిక అంశాలపై అంతర్జాతీయ స్థాయి వర్క్షాప్లలో పాల్గొనే అవకాశం లభించనుంది.
తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే పటిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న చెన్నైస్ అమృత, ఇప్పుడు తన కార్యకలాపాలను దేశ రాజధాని న్యూఢిల్లీకి విస్తరిస్తోంది. 2035 నాటికి విమానయాన రంగంలో దాదాపు 2 లక్షల మంది నిపుణుల అవసరం ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో, ఈ సంస్థ విద్యార్థులను ప్రపంచస్థాయి సవాళ్లకు సిద్ధం చేస్తోంది. బ్యాచిలర్ డిగ్రీ మరియు డిప్లొమా కోర్సుల్లో చేరిన విద్యార్థులు మొదటి రెండేళ్లు చెన్నైలో శిక్షణ పూర్తి చేసుకుని, చివరి ఏడాదిలో మలేషియాలో ఆరు నెలల అకడమిక్ శిక్షణ మరియు ఆరు నెలల పాటు అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇంటర్న్షిప్ చేసే వెసులుబాటు కల్పించారు.
ఏవియేషన్ రంగంలో గ్లోబల్ పాస్పోర్ట్గా భావించే ఐఏటీఏ (IATA) సర్టిఫికేషన్ శిక్షణను చెన్నైస్ అమృత తన విద్యార్థులకు ఉచితంగా అందించడం విశేషం. సాధారణంగా ఇతర సంస్థల్లో రూ. 50 వేల నుండి రూ. 1.5 లక్షల వరకు ఖర్చయ్యే ఈ శిక్షణను, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ పర్యవేక్షణలో విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. అంతర్జాతీయ అనుభవం కోసం విద్యా రుణ సహాయం, చదువుకుంటూ సంపాదించుకునే (Part-time jobs) అవకాశం మరియు ప్లేస్మెంట్స్ పై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా ఈ సంస్థ విమానయాన విద్యలో తనదైన ముద్ర వేస్తోంది.
తాజా వార్తలు
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్







