ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- April 08, 2026
న్యూ ఢిల్లీ: భారతదేశంలోని ప్రముఖ విమానయాన శిక్షణా సంస్థ ‘చెన్నైస్ అమృత ఇంటర్నేషనల్ ఏవియేషన్ కాలేజ్’, విమానయాన రంగంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను విద్యార్థులకు అందించే దిశగా అడుగులు వేస్తోంది. మలేషియా వర్సిటీతో చేతులు కలిపిన చెన్నైస్ అమృత విమానయాన రంగంలో గ్లోబల్ ఎక్స్పోజర్ను విద్యార్థుల ముంగిటకే తీసుకురావడానికి చెన్నైస్ అమృత ఇంటర్నేషనల్ ఏవియేషన్ కాలేజ్, యూనికామ్ (UniCAM) మలేషియాతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. చెన్నైలో ఏప్రిల్ 8, 2026న జరిగిన ఈ కార్యక్రమంలో ఇరు సంస్థల ప్రతినిధులు అవగాహన ఒప్పందం (MoU)పై సంతకాలు చేశారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా విద్యార్థులు మలేషియా నిపుణుల సమక్షంలో శిక్షణ పొందడమే కాకుండా, ఏవియేషన్ 4.0, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), విమానాశ్రయ కార్యకలాపాలు వంటి ఆధునిక అంశాలపై అంతర్జాతీయ స్థాయి వర్క్షాప్లలో పాల్గొనే అవకాశం లభించనుంది.
తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే పటిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న చెన్నైస్ అమృత, ఇప్పుడు తన కార్యకలాపాలను దేశ రాజధాని న్యూఢిల్లీకి విస్తరిస్తోంది. 2035 నాటికి విమానయాన రంగంలో దాదాపు 2 లక్షల మంది నిపుణుల అవసరం ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో, ఈ సంస్థ విద్యార్థులను ప్రపంచస్థాయి సవాళ్లకు సిద్ధం చేస్తోంది. బ్యాచిలర్ డిగ్రీ మరియు డిప్లొమా కోర్సుల్లో చేరిన విద్యార్థులు మొదటి రెండేళ్లు చెన్నైలో శిక్షణ పూర్తి చేసుకుని, చివరి ఏడాదిలో మలేషియాలో ఆరు నెలల అకడమిక్ శిక్షణ మరియు ఆరు నెలల పాటు అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇంటర్న్షిప్ చేసే వెసులుబాటు కల్పించారు.
ఏవియేషన్ రంగంలో గ్లోబల్ పాస్పోర్ట్గా భావించే ఐఏటీఏ (IATA) సర్టిఫికేషన్ శిక్షణను చెన్నైస్ అమృత తన విద్యార్థులకు ఉచితంగా అందించడం విశేషం. సాధారణంగా ఇతర సంస్థల్లో రూ. 50 వేల నుండి రూ. 1.5 లక్షల వరకు ఖర్చయ్యే ఈ శిక్షణను, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ పర్యవేక్షణలో విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. అంతర్జాతీయ అనుభవం కోసం విద్యా రుణ సహాయం, చదువుకుంటూ సంపాదించుకునే (Part-time jobs) అవకాశం మరియు ప్లేస్మెంట్స్ పై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా ఈ సంస్థ విమానయాన విద్యలో తనదైన ముద్ర వేస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









