ఖతార్ సిఎస్ఆర్ డ్రైవ్కి మినిస్ట్రీ సపోర్ట్
- May 31, 2016
అల్ బరాకా కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ (సిఎస్ఆర్) ఇనీషియేటివ్ని మినిస్ట్రీ ఆఫ్ ఎకానమనీ అండ్ కామర్స్ (ఎంఇసి) ప్రారంభించింది. ఈద్ ఛారిటీ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. కార్పొరేట్ సంస్థలు తమ లాభాల్లో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించేలా చైతన్యం పెంచేందుకు మినిస్ట్రీ ప్రయత్నిస్తోంది. తక్కువ జీతాలతో సతమతమవుతున్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో మేలు చేస్తుందని మినిస్ట్రీ వర్గాలు చెప్పాయి. కార్పొరేట్ సంస్థలు సేవా రంగంలో చురుగ్గా పాల్గొనాలని ఎంఇసి పేర్కొంది. ఈద్ ఛారిటీ పర్యవేక్షణలో అల్ బకారా ఎండోవ్మెంట్ ఫండ్ ఏర్పాటయ్యింది. 36 మిలియన్ ఖతారీ రియాల్స్ ఫండ్ని సేకరించడం ఈ ఛారిటీ లక్ష్యం. ఈద్ ఛారిటీ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవడం లేదా, హెడ్ క్వార్టర్స్ని సందర్శించి, డొనేషన్లు అందించవలసిందిగా మినిస్ట్రీ కోరుతోంది.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









