పోలీస్ స్టేషన్లో పోసాని..
- May 31, 2016
మెంటల్ కృష్ణ అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆయనేనండి మన పోసాని కృష్ణ మురళి. ఇండస్ట్రీలో ఎవరితోనూ గొడవ పెట్టుకోడనే పేరున్న పోసాని పోలీస్ స్టేషన్ కు ఎందుకు వెళ్లాడు అనేదే కదా మీ అనుమానం. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న పోసాని కృష్ణ మురళిని ఎవరో నరేష్ అనే వ్యక్తి ఫోన్లోనూ.. మెసేజ్ ల ద్వారా భయపెడుతున్నాడని, తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. నరేష్ అనే వ్యక్తి తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నట్టుగా కేస్ పెట్టాడు. కేస్ ఫైల్ చేసిన ఎస్.ఆర్.నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోసాని కృష్ణ మురళి కాల్ డేటాను పోలీసులు తీసుకుంటున్నారు. ఇక అసలు నరేష్ అన్న వ్యక్తి ఎందుకు పోసానిని టార్గెట్ చేశాడు. పోసానికి వారికి ఉన్న గొడవలు ఏంటన్నది విచారణ చేపట్టనున్నారు. స్టేషన్ కు వచ్చిన పోసానిని చూసి ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర కొంత హడావుడి ఏర్పడింది. నరేష్ ఎవరో కాదు.. ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ దర్శకుడి తమ్ముడే. ఒకప్పుడు ఆయన మంచి మంచి సినిమాలు కూడా చేశాడు. ఈ మధ్య కాస్త రేస్ లో వెనకబడిపోయాడు అది వేరే విషయం. ఆయన గారి తమ్ముడే ఇప్పుడు పోసానిని వేధించింది. అది కూడా డబ్బు వ్యవహారం కోసమే. తరుచూ ఆ వ్యక్తి పోసానికి ఫోన్ చేసి డబ్బు అప్పుగా ఇవ్వమని వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడేవాడట. దాంతో విసిగిపోయిన పోసాని పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడని సమాచారం.
తాజా వార్తలు
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!









