సీఫ్ మాల్లో అరడోస్ కాయిన్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- January 28, 2024
బహ్రెయిన్: మనామాలోని సీఫ్ మాల్లో ప్రఖ్యాత అరడోస్ కాయిన్ ఎగ్జిబిషన్, వేలం ఆరవ ఎడిషన్ ప్రారంభం అయింది. దీనిని యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హిస్ ఎక్సలెన్సీ మర్వాన్ ఫౌద్ కమల్ అధికారికంగా ప్రారంభించారు. ఈ ఈవెంట్కు 14 దేశాల వారు పాల్గొంటున్నారు. ఉమయ్యద్ మరియు సస్సానిద్ నాణేలు, ఇరాక్ రాజు ఫైసల్ I నాణేలు, అలాగే అరుదైన గల్ఫ్ నాణేలు మరియు 1780 నాటి ఎంప్రెస్ థెరిసా ఆఫ్ ఆస్ట్రియా నాణేలతో సహా అరుదైన చారిత్రక కరెన్సీల ఆకర్షణీయమైన శ్రేణిని కలిగి ఉన్న ప్రదర్శనను అండర్ సెక్రటరీ అబ్బాసిద్ తిలకించారు. ప్రపంచ సంస్కృతులను అర్థం చేసుకోవడానికి ఇవి దోహదం చేస్తాయన్నారు. యువతకు వారి అభిరుచులలో మద్దతు ఇవ్వడంలో.. ప్రోత్సహించడంలో ఎగ్జిబిషన్ కీలక పాత్రను పోషిస్తుందని తెలిపారు. అరుదైన కరెన్సీలను ప్రదర్శించడానికి, మార్కెట్ చేయడానికి ఇది వేదికగా నిలుస్తుందన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







