ఢిల్లీలోని కల్కాజీ మందిర్లో ప్రమాదం.. ఒకరు దుర్మరణం
- January 28, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన కల్కాజీ మందర్ (కాళికా దేవి మందిరం)లో నిన్న రాత్రి జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ క్రమంలో భక్తులు ప్రొగ్రాంకు పెద్దఎత్తున హాజరయ్యారు. మరోవైపు జాగరణ కార్యక్రమం కొనసాగుతుండగానే అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆందోళనకు గురైన భక్తులు అక్కడి నంచి పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వాహకులు జాగరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక చర్యలు: సిపి రాజశేఖరబాబు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!









