వెడ్డింగ్ ప్లానర్పై నూతన దంపతులు దావా.. BD5,000 చెల్లించాలని డిమాండ్
- January 30, 2024
బహ్రెయిన్: పిక్చర్-పర్ఫెక్ట్ ఫెయిరీ టేల్ వెడ్డింగ్ అనేది బహ్రెయిన్ జంటకు పీడకలగా మార్చింది. వారి కలల రోజును వెడ్డింగ్ ప్లానర్ సంస్థ నాశనం చేసినట్లు ఓ జంట ఆరోపించింది. తాజాగా వెడ్డింగ్ ప్లానర్పై BD5,000 కోసం దావా వేశారు. బహ్రెయిన్ హై సివిల్ కోర్ట్ ప్రస్తుతం ఈ కేసును విచారిస్తోంది. తమతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. వెడ్డింగ్ ప్లానర్ తమకు సర్వీస్ అందివ్వలేదని, పైగా తమను తీవ్ర అసహనానికి, అవమానానికి గురిచేసారని పిటిషన్ లో నూతన వధూవరులు ఆరోపించారు. దంపతులకు ఏర్పాటు చేసిన డిజైన్లు, ఏర్పాట్లు ముందు అనుకున్న రీతిలో లేవని, నాసిరకం ఏర్పాట్లు, వస్తువులను వెడ్డింగ్ సందర్భంగా ఉపయోగించారని పేర్కొన్నారు. తాము వారిపై పెట్టిన నమ్మకాన్ని దెబ్బతీసిందన్నారు. సరిపోలని వేదిక బ్యాక్డ్రాప్లు, వేడుకకు కొన్ని గంటల ముందు ఘాటైన రంగులతో రంగులు వేసిన పూల అమరికల నుండి చెత్త ఫ్లోరింగ్ మరియు నాసిరకం లైటింగ్ వరకు, పెళ్లిని నిర్వహించడం ఆశించిన స్థాయిలో జరగలేదని కొత్త దంపతులు ఆరోపించారు. "జీవితంలో ఒకసారి జరిగే సంఘటన కోసం వారు పెద్ద మొత్తాన్ని చెల్లించారు. వారి కలల రోజును వెడ్డింగ్ ప్లానర్ అస్తవ్యస్తంగా మార్చింది" అని కొత్త జంట తరఫు న్యాయవాది వాదించారు. కంపెనీ నిర్లక్ష్యానికి సంబంధించి ఫోటోలు, వీడియోలు మరియు ఒప్పందాన్ని పూర్తి సాక్ష్యంగా కోర్టుకు సమర్పించారు. వారు అనుభవించిన మానసిక క్షోభ, భౌతిక మరియు నైతిక పరిహారం కింద ఆ జంట BD5,000 డిమాండ్ చేశారు. న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు ఇస్తుందో లేదో చూడాల్సి ఉంది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









