పరీక్షలలో కాపీ కొడుతూ దొరికితే Dh200,000 వరకు జరిమానా

- February 07, 2024 , by Maagulf
పరీక్షలలో కాపీ కొడుతూ దొరికితే Dh200,000 వరకు జరిమానా

యూఏఈ: ఒక ఫెడరల్ చట్టం ప్రకారం..పరీక్షలలో మోసం చేస్తే పట్టుబడితే Dh200,000 వరకు జరిమానాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. పరీక్షలకు సంబంధించి ప్రశ్నలు, సమాధానాలు లేదా పరీక్షల కంటెంట్‌కు సంబంధించిన సమాచారాన్ని ఏ విధంగానైనా ప్రింట్ చేయడం, ప్రచురించడం, ప్రచారం చేయడం, ప్రసారం చేయడం లేదా లీక్ చేయడం, అతని/ఆమె స్థానంలో పరీక్ష రాసిన వారికి జరిమానా విధించబడుతుంది. గత సంవత్సరం ఆమోదించబడిన వివిధ రంగాలలోని 73 ఫెడరల్ చట్టాలలో ఈ చట్టం ఒకటి. నేరం రుజువైతే పెనాల్టీ లేదా జరిమానా స్థానంలో  నేరస్థుడు ఆరు నెలల వరకు కమ్యూనిటీ సేవ చేయాల్సి ఉంటుంది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలతో సహా ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలకు ఈ చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయి. షైనింగ్ స్టార్ ఇంటర్నేషనల్ ప్రిన్సిపాల్ అభిలాషా సింగ్ మాట్లాడుతూ.. నిజాయితీగా ఉండాలని పాఠశాలలో విద్యార్థులకు నేర్పుతామన్నారు. కఠినమైన నిబంధనలు విద్యార్థులను సరైన మార్గంలో నడిపించేందుకు దోహదం చేస్తాయని ఆమె స్పష్టం చేసారు. పరీక్షలలో తప్పులు చేస్తే కఠినంగా వ్యవహరిస్తారు. వారి చర్యలకు పరిణామాలు ఉన్నాయని పిల్లలు అర్థం చేసుకుంటారు. నిజానికి మొత్తం పాఠశాల వ్యవస్థ నిజాయితీ, సమగ్రత విలువలపై ఆధారపడి ఉంటుందని వివరించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com