ఒమన్కు 20% తగ్గిన బంగ్లాదేశ్ ప్రవాసుల రాక
- February 11, 2024
మస్కట్: అక్టోబర్ 31, 2023 నుండి అన్ని వర్గాల వారికి వీసాల జారీని ఒమన్ నిషేధించినప్పటి నుండి ఒమన్కు బంగ్లాదేశ్ పౌరుల సంఖ్య 20% పైగా తగ్గింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) నుండి విడదలైన నివేదిక ప్రకారం.. డిసెంబర్ 2023 చివరి నాటికి ఒమన్కు చేరుకున్న బంగ్లాదేశ్ పౌరుల సంఖ్య 22,312గా ఉంది. సెప్టెంబరులో బంగ్లాదేశ్కు వచ్చిన వారి సంఖ్య 28,201గా ఉంది. గత మూడు నెలల్లో 20 శాతానికి పైగా పడిపోయింది. అక్టోబరు 31న జారీ చేసిన సర్క్యులర్లో రాయల్ ఒమన్ పోలీస్ (ROP) బంగ్లాదేశ్ పౌరులకు అన్ని వర్గాలలో వీసాల జారీని నిలిపివేసింది. మరోవైపు బంగ్లాదేశ్ పౌరులకు వీసాలు త్వరలో ప్రారంభమవుతాయని బంగ్లాదేశ్ సోషల్ క్లబ్ ఒమన్ చైర్మన్ సిరాజుల్ హక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









