ఖతార్ నుంచి 8 మంది భారత మాజీ నేవీ అధికారుల విడుదల

- February 12, 2024 , by Maagulf
ఖతార్ నుంచి 8 మంది భారత మాజీ నేవీ అధికారుల విడుదల

న్యూ ఢిల్లీ: ఖతార్ లో గూఢచర్యం ఆరోపణల పై అరెస్ట్ అయ్యిన ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సిబ్బందిని ఖతార్ ప్రభుత్వం విడుదల చేసింది.విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA)సోమవారం తెల్లవారుజామున ఓ ప్రకటన విడుదల చేసింది.ఈ పరిణామాన్ని స్వాగతించింది.

అల్ దహ్రా గ్లోబల్ కంపెనీ అనే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ సిబ్బందిలో ఏడుగురు ఖతార్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చారని తెలిపారు.

"ఖతార్‌లో నిర్బంధించబడిన దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. ఎనిమిది మందిలో ఏడుగురు భారతదేశానికి తిరిగి వచ్చారు. ఖతార్ రాష్ట్ర ఎమిర్ నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నాము. " అని MEA ఒక ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com