ఒమన్లో భారీ వర్షాలు.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య
- February 15, 2024
మస్కట్: సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాలకు ఒమన్ లో ముగ్గురు పిల్లలు, ఒక మహిళతో సహా ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. రుస్తాక్లోని వాడి బానీ గఫీర్లో ముగ్గురు చిన్నారులు మునిగి చనిపోగా, ఇజ్కీలోని విలాయత్లో జరిగిన ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందని అధికారులు తెలిపారు. యాన్కుల్లోని వాడి ఘయ్యాలో మరొక వ్యక్తి చనిపోగా, జబల్ అఖ్దర్లో రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. యాన్కుల్లో ఒకరు, జబల్ అఖ్దర్లో మరొకరు తప్పిపోయినట్లు సమాచారం. సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ), సహాయక మరియు రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తోంది. ఇప్పటివరకు ఒమన్లోని వివిధ ప్రాంతాలలో దాదాపు 200 మందిని సురక్షితంగా రక్షించినట్లు సిడేఎఎ తెలిపింది.
అల్ దఖిలియా గవర్నరేట్లో లోయలను దాటేందకు యత్నించిన 36 మందిని అరెస్టు చేసినట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, లోయలు దాటడం ప్రమాదకరమని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల సమయంలో ప్రజలు ఇంట్లోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సిడిఎఎ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







