ఒమన్లో భారీ వర్షాలు.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య
- February 15, 2024
మస్కట్: సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాలకు ఒమన్ లో ముగ్గురు పిల్లలు, ఒక మహిళతో సహా ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. రుస్తాక్లోని వాడి బానీ గఫీర్లో ముగ్గురు చిన్నారులు మునిగి చనిపోగా, ఇజ్కీలోని విలాయత్లో జరిగిన ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందని అధికారులు తెలిపారు. యాన్కుల్లోని వాడి ఘయ్యాలో మరొక వ్యక్తి చనిపోగా, జబల్ అఖ్దర్లో రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. యాన్కుల్లో ఒకరు, జబల్ అఖ్దర్లో మరొకరు తప్పిపోయినట్లు సమాచారం. సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ), సహాయక మరియు రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తోంది. ఇప్పటివరకు ఒమన్లోని వివిధ ప్రాంతాలలో దాదాపు 200 మందిని సురక్షితంగా రక్షించినట్లు సిడేఎఎ తెలిపింది.
అల్ దఖిలియా గవర్నరేట్లో లోయలను దాటేందకు యత్నించిన 36 మందిని అరెస్టు చేసినట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, లోయలు దాటడం ప్రమాదకరమని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల సమయంలో ప్రజలు ఇంట్లోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సిడిఎఎ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!







