ఒమన్లో భారీ వర్షాలు.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య
- February 15, 2024మస్కట్: సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాలకు ఒమన్ లో ముగ్గురు పిల్లలు, ఒక మహిళతో సహా ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. రుస్తాక్లోని వాడి బానీ గఫీర్లో ముగ్గురు చిన్నారులు మునిగి చనిపోగా, ఇజ్కీలోని విలాయత్లో జరిగిన ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందని అధికారులు తెలిపారు. యాన్కుల్లోని వాడి ఘయ్యాలో మరొక వ్యక్తి చనిపోగా, జబల్ అఖ్దర్లో రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. యాన్కుల్లో ఒకరు, జబల్ అఖ్దర్లో మరొకరు తప్పిపోయినట్లు సమాచారం. సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ), సహాయక మరియు రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తోంది. ఇప్పటివరకు ఒమన్లోని వివిధ ప్రాంతాలలో దాదాపు 200 మందిని సురక్షితంగా రక్షించినట్లు సిడేఎఎ తెలిపింది.
అల్ దఖిలియా గవర్నరేట్లో లోయలను దాటేందకు యత్నించిన 36 మందిని అరెస్టు చేసినట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, లోయలు దాటడం ప్రమాదకరమని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల సమయంలో ప్రజలు ఇంట్లోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సిడిఎఎ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..