'సాలరీ ఇన్ అడ్వాన్స్' సౌకర్యాన్ని నిలిపివేసిన టాప్ బ్యాంక్
- February 21, 2024
యూఏఈ: యూఏఈ టాప్ దుబాయ్ ఇస్లామిక్ బ్యాంక్.. కస్టమర్ల కోసం 'సాలరీ ఇన్ అడ్వాన్స్' సదుపాయాన్ని నిలిపివేసింది. తన ఆర్థిక ఉత్పత్తులను పూర్తిగా మూల్యాంకనం చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ తెలిపింది. "మా ఆర్థిక ఉత్పత్తుల పోర్ట్ఫోలియోను జాగ్రత్తగా పరిశీలించి.. సమగ్ర మూల్యాంకనం చేసిన తర్వాత మా శాలరీ ఇన్ అడ్వాన్స్ సదుపాయాన్ని నిలిపివేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం." అని దుబాయ్ ఆధారిత బ్యాంక్ ప్రకటనలో తెలిపింది. అయితే, అనేక ఇతర స్థానిక బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. DIB 'సాలరీ ఇన్ అడ్వాన్స్' సదుపాయాన్ని చాలా మంది యూఏఈ నివాసితులు ఆర్థిక సంక్షోభం, ఇతర అత్యవసర వ్యక్తిగత అవసరాల సమయంలో వినియోగించుకున్నారు. కస్టమర్లు అడ్వాన్స్ జీతం కోసం ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా ATMల ద్వారా రెండు వందల దిర్హామ్లు చెల్లించి సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. దుబాయ్ ఇస్లామిక్ బ్యాంక్ గ్రూప్ గత నెలలో 2023కి సంబంధించి Dh7 బిలియన్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 26 శాతం అధికం.
తాజా వార్తలు
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- ఏసీ పేలడం తో 8 మంది మృతి...
- మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- 'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!









