దుబాయ్లో $1 మిలియన్ గెలుచుకున్న భారతీయ టూరిస్ట్
- February 22, 2024
దుబాయ్: బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగిన తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ అండ్ ఫైనెస్ట్ సర్ప్రైజ్ డ్రాలో మొదటిసారి టిక్కెట్ కొనుగోలు చేసిన రూపా హరీష్ ధావన్ , నానా కకిహారా మిలియనీర్లు అయ్యారు. రూపా హరీష్ ధావన్ 49 ఏళ్ల భారతీయురాలు. ఆమె జనవరి 28న దుబాయ్ నుండి ముంబైకి తిరిగి వచ్చే సమయంలో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 2869తో $1 మిలియన్ గెలుచుకుంది. మొదటి సారి టిక్కెట్ కొనుగోలు చేసిన రూపాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె తన 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి దుబాయ్కి వచ్చారు. "దుబాయ్ డ్యూయ్ ఫ్రీకి నా మొట్టమొదటి టిక్కెట్తో నా జీవితం మారిపోతుందని నేను నమ్మలేకపోతున్నాను. ఇందుకు దుబాయ్ డ్యూటీ ఫ్రీకి ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుతాను.” అని ఆమె తెలిపింది. రూపా 1999లో ప్రారంభించినప్పటి నుండి మిలీనియం మిలియనీర్ ప్రమోషన్లో $1 మిలియన్ గెలుచుకున్న 224వ భారతీయురాలు.
యూఏఈ ఉన్న భారతీయురాలు రష్మీ ఫిబ్రవరి 11న ఆన్లైన్లో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 2478తో మెర్సిడెస్ జి 63 (పోలార్ వైట్) కారును గెలుచుకున్నారు. దుబాయ్లో ఉన్న 44 ఏళ్ల భారతీయుడు సీమస్ లూయిస్ ఫిబ్రవరి 5న ఆన్లైన్లో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 0781తో కూడిన అప్రిలియా టువోనో V4 ఫ్యాక్టరీ (టైమ్ అటాక్ - బ్లాక్ రెడ్) మోటార్బైక్ను గెలుచుకున్నాడు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC ట్యాంకర్ పై ఇరాన్ డ్రోన్ దాడి.. తీవ్రంగా ఖండించిన యూఏఈ
- సీబ్ విలాయత్లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్సలు: డాక్టర్ ప్రతాప్
- విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్









