దుబాయ్లో $1 మిలియన్ గెలుచుకున్న భారతీయ టూరిస్ట్
- February 22, 2024
దుబాయ్: బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగిన తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ అండ్ ఫైనెస్ట్ సర్ప్రైజ్ డ్రాలో మొదటిసారి టిక్కెట్ కొనుగోలు చేసిన రూపా హరీష్ ధావన్ , నానా కకిహారా మిలియనీర్లు అయ్యారు. రూపా హరీష్ ధావన్ 49 ఏళ్ల భారతీయురాలు. ఆమె జనవరి 28న దుబాయ్ నుండి ముంబైకి తిరిగి వచ్చే సమయంలో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 2869తో $1 మిలియన్ గెలుచుకుంది. మొదటి సారి టిక్కెట్ కొనుగోలు చేసిన రూపాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె తన 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి దుబాయ్కి వచ్చారు. "దుబాయ్ డ్యూయ్ ఫ్రీకి నా మొట్టమొదటి టిక్కెట్తో నా జీవితం మారిపోతుందని నేను నమ్మలేకపోతున్నాను. ఇందుకు దుబాయ్ డ్యూటీ ఫ్రీకి ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుతాను.” అని ఆమె తెలిపింది. రూపా 1999లో ప్రారంభించినప్పటి నుండి మిలీనియం మిలియనీర్ ప్రమోషన్లో $1 మిలియన్ గెలుచుకున్న 224వ భారతీయురాలు.
యూఏఈ ఉన్న భారతీయురాలు రష్మీ ఫిబ్రవరి 11న ఆన్లైన్లో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 2478తో మెర్సిడెస్ జి 63 (పోలార్ వైట్) కారును గెలుచుకున్నారు. దుబాయ్లో ఉన్న 44 ఏళ్ల భారతీయుడు సీమస్ లూయిస్ ఫిబ్రవరి 5న ఆన్లైన్లో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 0781తో కూడిన అప్రిలియా టువోనో V4 ఫ్యాక్టరీ (టైమ్ అటాక్ - బ్లాక్ రెడ్) మోటార్బైక్ను గెలుచుకున్నాడు.
తాజా వార్తలు
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం







