భారతీయులకు కొత్తగా 5 ఏళ్ల మల్టీ ఎంట్రీ వీసాను ప్రకటించారా?
- February 24, 2024
దుబాయ్: గత రేండేళ్లుగా ఐదేళ్ల మల్టీపుల్ ఎంట్రీ వీసా అన్ని దేశాల పర్యాటకులకు అందుబాటులో ఉందని దుబాయ్ అధికారులు తెలిపారు. భారతీయ పర్యాటకుల కోసం కొత్తగా ఐదు సంవత్సరాల మల్టీపుల్ వీసా ప్రారంభించారని పలు భారతీయ మీడియా సంస్థలు గురువారం తెలిపాయి. వాస్తవానికి మల్టిపుల్-ఎంట్రీ పర్మిట్ మొదటిసారిగా 2021లో యూఏఈలో ప్రారంభించారు. ఇటీవల దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET) ముంబైలో జరిగిన ట్రావెల్ ఎక్స్పోలో దీనిని హైలైట్ చేసింది.వీసాకు చేసిన దరఖాస్తును ఆమోదించిన తర్వాత రెండు నుండి ఐదు పని దినాలలో వీసాను జారీ చేస్తారు. వీసా హోల్డర్ 90 రోజుల పాటు యూఏఈ ఉండవచ్చు. అదే వ్యవధికి ఒకసారి పొడిగించుకోవచ్చు. మొత్తం ఒక సంవత్సరంలో 180 రోజులకు మించకూడదు. గత రెండు సంవత్సరాలలో దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం 5-మల్టిపుల్-ఎంట్రీ టూరిస్ట్ వీసాకు సంబంధించి పెరుగుదలను నమోదు చేసినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా ఇండియా నుంచి భారీగా వీసా అప్లికేషన్లు వస్తున్నాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక







