భారతీయులకు కొత్తగా 5 ఏళ్ల మల్టీ ఎంట్రీ వీసాను ప్రకటించారా?
- February 24, 2024
దుబాయ్: గత రేండేళ్లుగా ఐదేళ్ల మల్టీపుల్ ఎంట్రీ వీసా అన్ని దేశాల పర్యాటకులకు అందుబాటులో ఉందని దుబాయ్ అధికారులు తెలిపారు. భారతీయ పర్యాటకుల కోసం కొత్తగా ఐదు సంవత్సరాల మల్టీపుల్ వీసా ప్రారంభించారని పలు భారతీయ మీడియా సంస్థలు గురువారం తెలిపాయి. వాస్తవానికి మల్టిపుల్-ఎంట్రీ పర్మిట్ మొదటిసారిగా 2021లో యూఏఈలో ప్రారంభించారు. ఇటీవల దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET) ముంబైలో జరిగిన ట్రావెల్ ఎక్స్పోలో దీనిని హైలైట్ చేసింది.వీసాకు చేసిన దరఖాస్తును ఆమోదించిన తర్వాత రెండు నుండి ఐదు పని దినాలలో వీసాను జారీ చేస్తారు. వీసా హోల్డర్ 90 రోజుల పాటు యూఏఈ ఉండవచ్చు. అదే వ్యవధికి ఒకసారి పొడిగించుకోవచ్చు. మొత్తం ఒక సంవత్సరంలో 180 రోజులకు మించకూడదు. గత రెండు సంవత్సరాలలో దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం 5-మల్టిపుల్-ఎంట్రీ టూరిస్ట్ వీసాకు సంబంధించి పెరుగుదలను నమోదు చేసినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా ఇండియా నుంచి భారీగా వీసా అప్లికేషన్లు వస్తున్నాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







