షార్జాలో రోడ్డు దాటుతూ..12 ఏళ్ల బాలుడు మృతి
- February 25, 2024
యూఏఈ: షార్జాలో జరిగిన ఘోర ప్రమాదంలో వాహనం ఢీకొనడంతో 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎమిరేట్లోని పాత ఎక్స్పో ఇంటర్ఛేంజ్ సమీపంలో బాలుడు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. షార్జా ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చిన్నారి ప్రాణాలతో చికిత్స పొందుతూ మరణించాడని షార్జా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ సైఫ్ అల్ జరీ అల్ షమ్సీ తెలిపారు. సిగ్నల్ రావడంతో వాహన డ్రైవర్ వెళుతుండగా.. బాలుడు అకస్మాత్తుగా ఎడమ వైపు నుండి రావడంతో ఘోర ప్రమాదం జరిగిందన్నారు. వాహనదారుడిపై ట్రాఫిక్ కేసు నమోదు చేసినట్టు.. తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







