ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా
- February 29, 2024
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ. 30 లక్షల జరిమానా విధించింది. 80 ఏళ్ల వఅద్ధుడు తన భార్యతో కలిసి ఎయిర్ ఇండియా విమానంలో న్యూయార్క్ నుండి ముంబయి చేరుకున్నాడు. విమానం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన అనంతరం విమానం నుండి టెర్మినల్ వరకు వీల్చైర్ ఏర్పాటు చేయకపోవడంతో నడుచుకుంటూ వెళ్లాలని నిర్ణయించాడు. అయితే కొంత దూరం నడిచిన అనంతరం ఆ వృద్ధుడు తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఈ ఘటన ఈ నెల 16వ తేదీన జరిగింది. ఈ ఘటనపై డిజిసిఎ తీవ్రంగా స్పందించింది. ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా వివరణనిస్తూ.. ఆ వృద్ధుని భార్యకు వీల్ చైర్ ఏర్పాటు చేశామని, మరొకటి ఏర్పాటు చేసే వరకు వేచి ఉండాలని సిబ్బంది కోరారని పేర్కొంది. అయితే ఆ వృద్ధుడు నడిచివెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలిపింది.
ఎయిరిండియా సంబంధిత నిబంధనలు ఉల్లంఘించిందని, రూ. 30 లక్షలు జరిమానా విధిస్తున్నట్లు డిజిసిఎ ప్రకటించింది. ప్రయాణికులకు వీల్చైర్ సమకూర్చడంపై విధి విధానాలు తప్పక పాటించాలని అన్ని విమానయాన సంస్థలకు సూచనలు జారీ చేసింది.
తాజా వార్తలు
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!









