బెంగుళూరు కేఫ్లో పేలుడు.. నలుగురికి గాయాలు
- March 01, 2024
బెంగళూరు: బెంగళూరు బ్రూక్ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురు కేఫ్ సిబ్బంది, ఒక కస్టమర్ ఉన్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, మధ్యాహ్నం ఒకటింటికి ఓ బ్యాగ్లో ఉంచిన వస్తువు పేలిపోయినట్లుగా తెలుస్తోంది. కానీ పేలుడుకు గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనలో గాయపడిన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని, ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, వారు క్షేమంగా ఉన్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
కేఫ్లో పేలుడు విషయం తెలియగానే వైట్ఫీల్డ్ ఏరియా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోపక్క, ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఫోరెన్సిక్ అధికారులు కేఫ్ వద్దకు చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. బెంగళూరులోని అత్యంత ప్రసిద్ధ ఫుడ్ జాయింట్ కేఫ్లలో రామేశ్వరం కేఫ్ ఒకటి.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









