‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- March 06, 2024
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 110 రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం ‘రైతు నేస్తం’. దశలవారీగా మూడేళ్లలో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను అందుబాటులోకి తీసుకువస్తారు. రూ.97 కోట్లతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. మొదటి దశలో రూ.4.07 కోట్లతో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించి నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- ప్రయాణీకులను హెచ్చరించిన HIA, ఖతార్ ఎయిర్వేస్..!!
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్









