చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- June 02, 2026
చండీగఢ్: కేంద్ర విద్యుత్, గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన చండీగఢ్లో నిర్వహించిన విద్యుత్ సంబంధిత సంప్రదింపుల కమిటీ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో దేశంలోని విద్యుత్ రంగ అభివృద్ధి, విద్యుత్ సరఫరా వ్యవస్థ బలోపేతం, పునరుత్పాదక ఇంధన వినియోగం, విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు మెరుగుదల తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి తమ పార్లమెంటరీ నియోజకవర్గం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ రంగ సమస్యలు, అభివృద్ధి అవసరాలు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తన అభిప్రాయాలను సమావేశంలో వెల్లడించారు.
దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో జరుగుతున్న సంస్కరణలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై సభ్యులతో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పలువురు పార్లమెంట్ సభ్యులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







