‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

- March 06, 2024 , by Maagulf
‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 110 రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం ‘రైతు నేస్తం’. దశలవారీగా మూడేళ్లలో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను అందుబాటులోకి తీసుకువస్తారు. రూ.97 కోట్లతో ఈ ప్రాజెక్టును అమలు చేయ‌నున్నారు. మొదటి దశలో రూ.4.07 కోట్లతో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించి నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com