ఆస్తుల పర్యాటక లీజు పై ప్రత్యేక కమిటీ..
- December 15, 2025
అమరావతి: రాష్ట్ర పర్యాటకభివృధ్ధి సంస్థకు చెందిన 22 హోటళ్లు, రిసార్టులు, ఇతర ఆస్థుల లీజుకు బిడ్ల మదింపు కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి ఈ కమిటీకి చైర్మన్ గా రాష్ట్ర పర్యాటక సంస్థ సిఇఒ కో-చైర్మన్ గా ఉంటారు. పర్యాటకాభివృద్ధి సంస్థ ఇడిని కన్వీనర్ గా మరో ఐదుగురిని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన ఆస్థుల నిర్వహణను లీజు పై ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విశాఖలోని మధురవాడలో మెగ్లాన్ లీజర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు ఐదెకరాల భూమితో పాటు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకే ఉత్తర్వులిచ్చింది. ఈ సంస్థ రూ.348.12 కోట్లతో ఫైక్టార్ హోటల్ ను నిర్మించనుంది. విశాఖలోని ఎండాడలో పివిఆర్ హాస్పిటాలిటీస్ అథ్వర్యంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి మూడెకరాలతో పాటు రాయితీలు ఇవ్వనుంది. బాపట్ల మండలం పాండురంగాపురం బీచ్లో యాగంటి ఎస్టేట్స్, ఫైవ్ స్టార్ బీచ్రిసార్టు ఏర్పాటుకు రాయితీలు ఇచ్చింది. తిరుపతిలో నాంది సంస్థకు 4 స్టార్ హోటల్ నిర్మాణం కోసం రాయితీలు ఇవ్వాలని వేర్వేరు జీఓల్లో ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







