అస్థిర వాతావరణ పరిస్థితులు.. ఉద్యోగులకు రిమోట్ వర్క్ అనుమతి..!
- March 09, 2024
యూఏఈ: అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా రిమోట్ వర్క కు ఉద్యోగులను అనుమతించాలని ప్రైవేట్ రంగ కంపెనీలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో మానవ వనరులు మరియు ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ అసాధారణమైన వాతావరణ పరిస్థితుల కారణంగా సౌకర్యవంతమైన పని విధానాలను వర్తింపజేయాలని కంపెనీలకు తెలిపింది. "వాతావరణ ఒడిదుడుకుల కాలంలో తమ కార్మికుల భద్రతను కాపాడేందుకు జాగ్రత్తలు, అవసరమైన అన్ని వృత్తిపరమైన భద్రతా చర్యలు తీసుకోవాలనిష అని ప్రైవేట్ కంపెనీలను కోరింది. అబుదాబిలోని నివాసితులు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు, రాజధానిలోని కొన్ని ప్రాంతాలు ఈదురు గాలులు, బలమైన వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్ ఐన్ మరియు అబుదాబిలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తెలిపే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు శుక్రవారం రస్ అల్ ఖైమాలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రతికూల వాతావరణం కారణంగా రిమోట్ లెర్నింగ్ను అమలు చేశాయి. ఈ ఆదివారం మధ్యాహ్నం వరకు దేశవ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ఇదిలా ఉండగా.. దేశంలోని పోలీసులు, రెస్క్యూ అధికారులు, పారామెడిక్స్ మరియు సివిల్ డిఫెన్స్ ఏదైనా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







