అస్థిర వాతావరణ పరిస్థితులు.. ఉద్యోగులకు రిమోట్ వర్క్ అనుమతి..!
- March 09, 2024
యూఏఈ: అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా రిమోట్ వర్క కు ఉద్యోగులను అనుమతించాలని ప్రైవేట్ రంగ కంపెనీలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో మానవ వనరులు మరియు ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ అసాధారణమైన వాతావరణ పరిస్థితుల కారణంగా సౌకర్యవంతమైన పని విధానాలను వర్తింపజేయాలని కంపెనీలకు తెలిపింది. "వాతావరణ ఒడిదుడుకుల కాలంలో తమ కార్మికుల భద్రతను కాపాడేందుకు జాగ్రత్తలు, అవసరమైన అన్ని వృత్తిపరమైన భద్రతా చర్యలు తీసుకోవాలనిష అని ప్రైవేట్ కంపెనీలను కోరింది. అబుదాబిలోని నివాసితులు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు, రాజధానిలోని కొన్ని ప్రాంతాలు ఈదురు గాలులు, బలమైన వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్ ఐన్ మరియు అబుదాబిలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తెలిపే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు శుక్రవారం రస్ అల్ ఖైమాలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రతికూల వాతావరణం కారణంగా రిమోట్ లెర్నింగ్ను అమలు చేశాయి. ఈ ఆదివారం మధ్యాహ్నం వరకు దేశవ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ఇదిలా ఉండగా.. దేశంలోని పోలీసులు, రెస్క్యూ అధికారులు, పారామెడిక్స్ మరియు సివిల్ డిఫెన్స్ ఏదైనా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!









