అస్థిర వాతావరణ పరిస్థితులు.. ఉద్యోగులకు రిమోట్ వర్క్ అనుమతి..!
- March 09, 2024
యూఏఈ: అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా రిమోట్ వర్క కు ఉద్యోగులను అనుమతించాలని ప్రైవేట్ రంగ కంపెనీలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో మానవ వనరులు మరియు ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ అసాధారణమైన వాతావరణ పరిస్థితుల కారణంగా సౌకర్యవంతమైన పని విధానాలను వర్తింపజేయాలని కంపెనీలకు తెలిపింది. "వాతావరణ ఒడిదుడుకుల కాలంలో తమ కార్మికుల భద్రతను కాపాడేందుకు జాగ్రత్తలు, అవసరమైన అన్ని వృత్తిపరమైన భద్రతా చర్యలు తీసుకోవాలనిష అని ప్రైవేట్ కంపెనీలను కోరింది. అబుదాబిలోని నివాసితులు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు, రాజధానిలోని కొన్ని ప్రాంతాలు ఈదురు గాలులు, బలమైన వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్ ఐన్ మరియు అబుదాబిలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తెలిపే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు శుక్రవారం రస్ అల్ ఖైమాలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రతికూల వాతావరణం కారణంగా రిమోట్ లెర్నింగ్ను అమలు చేశాయి. ఈ ఆదివారం మధ్యాహ్నం వరకు దేశవ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ఇదిలా ఉండగా.. దేశంలోని పోలీసులు, రెస్క్యూ అధికారులు, పారామెడిక్స్ మరియు సివిల్ డిఫెన్స్ ఏదైనా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష