కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- March 04, 2026
మస్కట్: కువైట్ సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సభ్యులు మరణించడం పట్ల ఒమన్ సుల్తానేట్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
"కువైట్ సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సభ్యులు తమ జాతీయ విధులను నిర్వర్తిస్తూ మరణించడం పట్ల విదేశాంగ మంత్రిత్వ శాఖ కువైట్ ప్రభుత్వానికి, అమరవీరుల కుటుంబాలకు మరియు ప్రజలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది" అని తన ప్రకటనలో ఒమన్ తెలిపింది.గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
కువైట్ నావల్ ఫోర్స్ సభ్యులు సార్జెంట్ వలీద్ మజీద్ సులేమాన్ మరియు సార్జెంట్ అబ్దులాజీజ్ అబ్దుల్మోహ్సేన్ దఖేల్ నాసర్ మృతికి కువైట్ జనరల్ స్టాఫ్ సంతాపం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









