కువైట్‌లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!

- March 04, 2026 , by Maagulf
కువైట్‌లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!

మస్కట్: కువైట్ సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సభ్యులు మరణించడం పట్ల ఒమన్ సుల్తానేట్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

"కువైట్ సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సభ్యులు తమ జాతీయ విధులను నిర్వర్తిస్తూ మరణించడం పట్ల విదేశాంగ మంత్రిత్వ శాఖ కువైట్ ప్రభుత్వానికి, అమరవీరుల కుటుంబాలకు మరియు ప్రజలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది" అని తన ప్రకటనలో ఒమన్ తెలిపింది.గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. 

కువైట్ నావల్ ఫోర్స్ సభ్యులు సార్జెంట్ వలీద్ మజీద్ సులేమాన్ మరియు సార్జెంట్ అబ్దులాజీజ్ అబ్దుల్‌మోహ్సేన్ దఖేల్ నాసర్ మృతికి కువైట్ జనరల్ స్టాఫ్ సంతాపం వ్యక్తం చేసింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com