అబుదాబి-డబ్లిన్ విమానంలో ప్రయాణీకుడికి మీజిల్స్ పాజిటివ్
- March 14, 2024
యూఏఈ: అబుదాబి-డబ్లిన్ విమానంలో ప్రయాణీకుడికి మీజిల్స్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఎతిహాద్ ఎయిర్వేస్ హెచ్చరిక జారీ చేసింది.ఎతిహాద్ ఎయిర్వేస్ విమానంలో అబుదాబి నుంచి డబ్లిన్ వెళ్తున్న ఓ ప్రయాణికుడికి మీజిల్స్ పాజిటివ్గా తేలిందని పేర్కొంది. ఈ సంఘటన గురించి ఐరిష్ అధికారులు తమకు సమాచారం అందించారని, అన్ని సన్నిహిత ట్రేసింగ్ కోసం అధికారులతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు హెల్త్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (HSE) కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా ఐర్లాండ్ అధికారులు కోరారని వెల్లడించింది. ప్రయాణీకులను ప్రత్యేక గదిలో ఇంట్లోనే ఉండి, లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవాలని కోరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మీజిల్స్ అనేది పిల్లలలో సర్వసాధారణం. వైరస్ వల్ల కలిగే అంటువ్యాధి. ఇది గాలిల ద్వార వ్యాపిస్తుంది. ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి శ్వాస తీసుకున్నప్పుడు, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు సులభంగా వ్యాపిస్తుంది. మీజిల్స్ టీకా 2000 - 2021 మధ్య 56 మిలియన్ల మరణాలను నివారించింది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









