అబుదాబి-డబ్లిన్ విమానంలో ప్రయాణీకుడికి మీజిల్స్ పాజిటివ్
- March 14, 2024
యూఏఈ: అబుదాబి-డబ్లిన్ విమానంలో ప్రయాణీకుడికి మీజిల్స్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఎతిహాద్ ఎయిర్వేస్ హెచ్చరిక జారీ చేసింది.ఎతిహాద్ ఎయిర్వేస్ విమానంలో అబుదాబి నుంచి డబ్లిన్ వెళ్తున్న ఓ ప్రయాణికుడికి మీజిల్స్ పాజిటివ్గా తేలిందని పేర్కొంది. ఈ సంఘటన గురించి ఐరిష్ అధికారులు తమకు సమాచారం అందించారని, అన్ని సన్నిహిత ట్రేసింగ్ కోసం అధికారులతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు హెల్త్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (HSE) కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా ఐర్లాండ్ అధికారులు కోరారని వెల్లడించింది. ప్రయాణీకులను ప్రత్యేక గదిలో ఇంట్లోనే ఉండి, లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవాలని కోరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మీజిల్స్ అనేది పిల్లలలో సర్వసాధారణం. వైరస్ వల్ల కలిగే అంటువ్యాధి. ఇది గాలిల ద్వార వ్యాపిస్తుంది. ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి శ్వాస తీసుకున్నప్పుడు, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు సులభంగా వ్యాపిస్తుంది. మీజిల్స్ టీకా 2000 - 2021 మధ్య 56 మిలియన్ల మరణాలను నివారించింది.
తాజా వార్తలు
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!







