ముస్లిం సోదరులకు నేడు ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం తరుఫున ఇఫ్తార్ విందు..

- March 15, 2024 , by Maagulf
ముస్లిం సోదరులకు నేడు ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం తరుఫున ఇఫ్తార్ విందు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు నేడు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ మొదటి శుక్రవారం కావడంతో ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ ఇఫ్తార్ విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి హాజరయ్యే ఇఫ్తార్ విందు ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com