హైదరాబాద్ లో ప్రధాని మోదీ రోడ్షో..
- March 15, 2024హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. శుక్రవారం (మార్చి 15న) మల్కాజిగిరి లోక్సభ స్థానం పరిధిలో మోదీ రోడ్షో ప్రారంభమైంది. ఈ సందర్భంగా రోడ్ షోకు మోదీకి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు.
మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్ వరకు దాదాపు 1.2 కిలోమీటర్ల మేర రోడ్ షో కొనసాగనుంది. మల్కాజిగిరిలో అశేష జనవాహినితో రోడ్లన్నీ కాషాయమయంగా మారాయి. రోడ్ షోలో మోదీతో పాటు 5 లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులు కూడా ఉన్నారు.
మల్కాజ్ గిరి, హైదరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్, భువనగిరి అభ్యర్థులతో మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. అయితే, రోడ్ షోలో ప్రధాని మోదీ వెంట కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. మల్కాజ్గిరి క్రాస్ రోడ్లో రోడ్ షో ముగిసిన అనంతరం ప్రధాని మోదీ రాజ్భవన్కు వెళ్లనున్నారు. ఈ రాత్రి అక్కడే బస చేయనున్నారు. శనివారం (మార్చి 16న) ప్రధాని మోదీ నాగర్కర్నూల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం