బైకర్ అజాగ్రత్తతో ఘోర ప్రమాదం..21 మంది దుర్మరణం
- March 17, 2024
అప్ఘానిస్థాన్: అప్ఘానిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అప్ఘానిస్థాన్లోని హెల్మాండ్ ప్రావిన్స్ లోని గెరాష్క్ జిల్లాలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను స్థానిక ట్రాఫిక్ నియంత్రణ అధికారి క్వద్రాతుల్లా వెల్లడించారు. ఒక బైకర్ తప్పిదంతో ఈ ఘోర ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. కాందహార్ నుంచి హెరత్ ప్రావిన్స్కు వెళ్తున్న బస్సును ఓ బైకర్ వచ్చి ఢీకొట్టాడు. దాంతో.. కంగారుపడిపోయిన బస్సు డ్రైవర్ స్టీరింగ్ పై అదుపు కోల్పోయాడు. దాంతో.. బస్సు రోడ్డు పక్కనే ఉన్న ఆయిల్ ట్యాంకర్ పైకి దూసుకెళ్లింది. దాంతో.. ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో విద్యార్థులందరికీ గుడ్న్యూస్..
- గల్ఫ్లో ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రద్దు – NBK అభిమానుల్లో తీవ్ర నిరాశ
- స్ట్రీమింగ్ మార్కెట్లో నెట్ఫ్లిక్స్ ఆధిపత్యం
- డైమండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఖతార్..!!
- సౌదీలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- ఇండిగో సంక్షోభం కంటిన్యూ..డొమెస్టిక్ సర్వీసెస్ క్యాన్సిల్..!!
- స్పెషల్ అట్రాక్షన్.. అల్-మసీలా బీచ్లో ఫియస్టా సిటీ..!!
- బహ్రెయిన్ ఫెస్టివల్ను ప్రారంభించిన షేక్ మొహమ్మద్..!!
- ‘అరబ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్న ఒమన్..!!
- ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు







