బహ్రెయిన్లో క్రాబ్ ఫిషింగ్ పై నిషేధం
- March 17, 2024
బహ్రెయిన్: పర్యావరణం కోసం సుప్రీం కౌన్సిల్ (SCE) క్రాబ్ ఫిషింగ్ పై నిషేధం విధించింది. ఇకపై క్రాబ్స్ పట్టుకోవడం, విక్రయించడంపై విధించిన రెండు నెలల నిషేధం ప్రారంభించినట్లు ప్రకటించింది. మే 15 వరకు క్రాబ్ ఫిషింగ్ పై నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది. ఈ నిషేధం 2016 నాటి శాసనం (52)కి అనుగుణంగా తీసుకున్నట్లు కౌన్సిల్ తెలిపింది. సముద్ర సంపద మరియు జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంలో బహ్రెయిన్ నిబద్ధతను స్పష్టం చేశారు. సముద్ర సంపద బృందాలు సంబంధిత అధికారుల సహకారంతో ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా నిషేధాన్ని పర్యవేక్షిస్తాయని పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న







