కాల్షియం అధికంగా వుండే ఆహార పదార్ధాలేంటో తెలుసా.?
- March 18, 2024
ఆరోగ్యంగా వుండేందుకు అన్నిమూలకాల్లోనూ కాల్షియం అధికంగా వుండడం అత్యుత్తమం. ఎముకలు ధృడంగా వుండేందుకు, రక్తం గడ్డ కట్టడం, కండరాల నొప్పులు లేకుండా వుండడం.. ఇలా చాలా రకాల పనులకు శరీరానికి కాల్షియం అవసరం. మరి, కాల్షియం కోసం ఏ ఏ ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి.? తెలుసుకుందాం.
వయసు పైబడే కొద్దీ శరీరంలో కాల్షియం డెఫిషియన్సీ వస్తుంటుంది. తద్వారా కీళ్లు, కండరాల నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతుంటాయ్. అందుకే 50 సంవత్సరాలు పైబడిన వారు ప్రత్యేకంగా కాల్షియం అధికంగా వుండే ఆహార పదార్ధాల్ని తీసుకోవాలి. అలాగే, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు సైతం కాల్షియం ఎక్కువగా అవసరమవుతుంది.
మరి, కాల్షియం అధికంగా వుండే ఆహార పదార్ధాలేవి.? పాలు పాల ఉత్పత్తుల్లో కాల్షియం అధికంగా వుంటుంది. అలాగే, ఆకు కూరలు కూడా వారంలో ఓ ఆర్డర్లో తీసుకోవాల్సిన ఆవశ్యకత వుంది.
నువ్వులు, రాగులు వంటి చిరు ధాన్యాల్లో కాల్షియం అధికంగా వుంటుంది. వీటిని జావ రూపంలో కానీ, స్వీట్లు ఇతరత్రా వంటకాల రూపంలో కానీ రెగ్యులర్గా డైట్లో చేర్చుకోవడం ఉత్తమం.
మాంసాహారులు చేపలు, మాంసం, గుడ్లు వంటి మాంసాహార ఉత్పత్తుల్ని తీసుకోవాలి. అలాగే శాఖా హారులకు చియాన్ గింజలు ఆయా మాంసాహార ఉత్పత్తుల్లో వుండే కాల్షియంని పుష్కలంగా అందిస్తుంది.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!