కాల్షియం అధికంగా వుండే ఆహార పదార్ధాలేంటో తెలుసా.?
- March 18, 2024
ఆరోగ్యంగా వుండేందుకు అన్నిమూలకాల్లోనూ కాల్షియం అధికంగా వుండడం అత్యుత్తమం. ఎముకలు ధృడంగా వుండేందుకు, రక్తం గడ్డ కట్టడం, కండరాల నొప్పులు లేకుండా వుండడం.. ఇలా చాలా రకాల పనులకు శరీరానికి కాల్షియం అవసరం. మరి, కాల్షియం కోసం ఏ ఏ ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి.? తెలుసుకుందాం.
వయసు పైబడే కొద్దీ శరీరంలో కాల్షియం డెఫిషియన్సీ వస్తుంటుంది. తద్వారా కీళ్లు, కండరాల నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతుంటాయ్. అందుకే 50 సంవత్సరాలు పైబడిన వారు ప్రత్యేకంగా కాల్షియం అధికంగా వుండే ఆహార పదార్ధాల్ని తీసుకోవాలి. అలాగే, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు సైతం కాల్షియం ఎక్కువగా అవసరమవుతుంది.
మరి, కాల్షియం అధికంగా వుండే ఆహార పదార్ధాలేవి.? పాలు పాల ఉత్పత్తుల్లో కాల్షియం అధికంగా వుంటుంది. అలాగే, ఆకు కూరలు కూడా వారంలో ఓ ఆర్డర్లో తీసుకోవాల్సిన ఆవశ్యకత వుంది.
నువ్వులు, రాగులు వంటి చిరు ధాన్యాల్లో కాల్షియం అధికంగా వుంటుంది. వీటిని జావ రూపంలో కానీ, స్వీట్లు ఇతరత్రా వంటకాల రూపంలో కానీ రెగ్యులర్గా డైట్లో చేర్చుకోవడం ఉత్తమం.
మాంసాహారులు చేపలు, మాంసం, గుడ్లు వంటి మాంసాహార ఉత్పత్తుల్ని తీసుకోవాలి. అలాగే శాఖా హారులకు చియాన్ గింజలు ఆయా మాంసాహార ఉత్పత్తుల్లో వుండే కాల్షియంని పుష్కలంగా అందిస్తుంది.
తాజా వార్తలు
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న
- అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
- వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!







