కాల్షియం అధికంగా వుండే ఆహార పదార్ధాలేంటో తెలుసా.?
- March 18, 2024ఆరోగ్యంగా వుండేందుకు అన్నిమూలకాల్లోనూ కాల్షియం అధికంగా వుండడం అత్యుత్తమం. ఎముకలు ధృడంగా వుండేందుకు, రక్తం గడ్డ కట్టడం, కండరాల నొప్పులు లేకుండా వుండడం.. ఇలా చాలా రకాల పనులకు శరీరానికి కాల్షియం అవసరం. మరి, కాల్షియం కోసం ఏ ఏ ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి.? తెలుసుకుందాం.
వయసు పైబడే కొద్దీ శరీరంలో కాల్షియం డెఫిషియన్సీ వస్తుంటుంది. తద్వారా కీళ్లు, కండరాల నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతుంటాయ్. అందుకే 50 సంవత్సరాలు పైబడిన వారు ప్రత్యేకంగా కాల్షియం అధికంగా వుండే ఆహార పదార్ధాల్ని తీసుకోవాలి. అలాగే, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు సైతం కాల్షియం ఎక్కువగా అవసరమవుతుంది.
మరి, కాల్షియం అధికంగా వుండే ఆహార పదార్ధాలేవి.? పాలు పాల ఉత్పత్తుల్లో కాల్షియం అధికంగా వుంటుంది. అలాగే, ఆకు కూరలు కూడా వారంలో ఓ ఆర్డర్లో తీసుకోవాల్సిన ఆవశ్యకత వుంది.
నువ్వులు, రాగులు వంటి చిరు ధాన్యాల్లో కాల్షియం అధికంగా వుంటుంది. వీటిని జావ రూపంలో కానీ, స్వీట్లు ఇతరత్రా వంటకాల రూపంలో కానీ రెగ్యులర్గా డైట్లో చేర్చుకోవడం ఉత్తమం.
మాంసాహారులు చేపలు, మాంసం, గుడ్లు వంటి మాంసాహార ఉత్పత్తుల్ని తీసుకోవాలి. అలాగే శాఖా హారులకు చియాన్ గింజలు ఆయా మాంసాహార ఉత్పత్తుల్లో వుండే కాల్షియంని పుష్కలంగా అందిస్తుంది.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!