ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం: ఈడీ
- March 18, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రూ.128.79 కోట్ల నగదు సీజ్ చేశామని ఈడీ తెలిపింది. ఈ మేరకు ఈడీ నేడు ప్రెస్ నోట్ విడుదల చేసింది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఇప్పటివరకు దేశంలో 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి.. రూ.128.79 కోట్ల నగదు సీజ్ చేశామని తెలిపింది.ఢిల్లీ, హైదరాబాద్,ముంబై, చెన్నైలో సోదాలు చేపట్టామని…ఈ కేసులో మనీశ్ సిసోడియా, సంజరు సింగ్, విజరు నాయర్, కవిత సహా ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశామని తెలిపింది. హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఈ నెల 15న సోదాలు జరిపామని, సోదాల సమయంలో కవిత బంధువులు ఆటంకం కలిగించారని పేర్కొంది.ఆప్ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









