ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం: ఈడీ
- March 18, 2024న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రూ.128.79 కోట్ల నగదు సీజ్ చేశామని ఈడీ తెలిపింది. ఈ మేరకు ఈడీ నేడు ప్రెస్ నోట్ విడుదల చేసింది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఇప్పటివరకు దేశంలో 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి.. రూ.128.79 కోట్ల నగదు సీజ్ చేశామని తెలిపింది.ఢిల్లీ, హైదరాబాద్,ముంబై, చెన్నైలో సోదాలు చేపట్టామని…ఈ కేసులో మనీశ్ సిసోడియా, సంజరు సింగ్, విజరు నాయర్, కవిత సహా ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశామని తెలిపింది. హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఈ నెల 15న సోదాలు జరిపామని, సోదాల సమయంలో కవిత బంధువులు ఆటంకం కలిగించారని పేర్కొంది.ఆప్ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..