ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో 128.79 కోట్ల నగదు సీజ్‌ చేశాం: ఈడీ

- March 18, 2024 , by Maagulf
ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో 128.79 కోట్ల నగదు సీజ్‌ చేశాం: ఈడీ

న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో రూ.128.79 కోట్ల నగదు సీజ్‌ చేశామని ఈడీ తెలిపింది. ఈ మేరకు ఈడీ నేడు ప్రెస్‌ నోట్‌ విడుదల చేసింది.ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసుకు సంబంధించి ఇప్పటివరకు దేశంలో 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి.. రూ.128.79 కోట్ల నగదు సీజ్‌ చేశామని తెలిపింది.ఢిల్లీ, హైదరాబాద్‌,ముంబై, చెన్నైలో సోదాలు చేపట్టామని…ఈ కేసులో మనీశ్‌ సిసోడియా, సంజరు సింగ్‌, విజరు నాయర్‌, కవిత సహా ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్‌ చేశామని తెలిపింది. హైదరాబాద్‌ లోని కవిత నివాసంలో ఈ నెల 15న సోదాలు జరిపామని, సోదాల సమయంలో కవిత బంధువులు ఆటంకం కలిగించారని పేర్కొంది.ఆప్‌ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com