ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం: ఈడీ
- March 18, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రూ.128.79 కోట్ల నగదు సీజ్ చేశామని ఈడీ తెలిపింది. ఈ మేరకు ఈడీ నేడు ప్రెస్ నోట్ విడుదల చేసింది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఇప్పటివరకు దేశంలో 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి.. రూ.128.79 కోట్ల నగదు సీజ్ చేశామని తెలిపింది.ఢిల్లీ, హైదరాబాద్,ముంబై, చెన్నైలో సోదాలు చేపట్టామని…ఈ కేసులో మనీశ్ సిసోడియా, సంజరు సింగ్, విజరు నాయర్, కవిత సహా ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశామని తెలిపింది. హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఈ నెల 15న సోదాలు జరిపామని, సోదాల సమయంలో కవిత బంధువులు ఆటంకం కలిగించారని పేర్కొంది.ఆప్ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న
- అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
- వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!
- సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- యూఏఈలో గోల్డ్, సిల్వర్ అమ్ముతున్న నివాసితులు..!!







