ఖతార్‌ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ

- June 04, 2016 , by Maagulf
ఖతార్‌ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ

ఐదు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఖతార్‌ చేరుకున్నారు. ఈ ఉదయం ఆఫ్ఘాన్‌లో సల్మాడ్యామ్‌ను ప్రారంభించిన మోదీ అక్కడి నుంచి ఖతార్‌ వెళ్లారు. దోహా చేరుకున్న ప్రధాని మోదీకి.. ఖతార్‌ ప్రధాని అబ్దుల్లా బిన్‌ నజీర్‌ బిన్‌ ఖలీఫా అల్‌ తని ఘనస్వాగతం పలికారు.
మోదీ రెండు రోజుల పాటు ఖతార్‌లో పర్యటిస్తారు. ఖతార్‌ ఎమిర్‌ షేక్‌ తమిమ్‌ బిన్‌ హమద్‌ అల్‌ తనితో మోదీ ఆదివారం సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com